Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ప్రణతి నిజ జనాన్ స్వాత్మాతుల్యాన్ కరోతి” అనేది ఆప్తవాక్యం. తనకు నమస్కరించినవారిని తనంతటి వారిని చేయగల మనీషి మాస్టర్ సి.వి.వి.
సి.వి.వి. అంటే కంచుపాటి వెంకటరావ్ వెంకస్వామి రావ్.
ఎన్నో సంవత్సరాలు కుంభకోణంలో కావేరీ నదీ తీరంలో ఆత్మ విచారణ సాగించారు, తపస్సు చేశాడు. ఆత్మ ప్రబోధం కలిగింది.
ఎప్పుడైతే ఆయనకు పరమాత్మ వాణి వినిపించసాగిందో, ఆ నాటి నుండి మాయ తొలగింది. సందేశాలను వ్రాసుకుని సాధన చేసేవారు, చేయించేవారు.
ఒకసారి మాస్టర్ గారు ముక్కులోని రంధ్రం ద్వారా ఆరు గంటలు నిర్విరామంగా గాలి పీల్చి, రెండో రంధ్రం ద్వారా ఆరు గంటలసేపు వదిలారు.
మరో ఆరు గంటలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఉన్నారు. ఆయన శరీరం దూదిలాగా తేలికై తేలింది గాలిలో.
మనమడు మట్టితో చేసిన బొమ్మను తిని చనిపోతే, సమాధి స్థితిలో ఉండి, ప్రాణముపోసి బ్రతికించారు.
పెంపుడు తల్లిగారు చనిపోతే, పదహారు రోజుల తరువాత తిరిగి బ్రతుకుతుందని, అప్పటివరకు ఆ శవాన్ని చీమలు తినకుండా కాపాడమని ఇతరులను హెచ్చరించి, తన పనిమీద వెళ్ళిపోయారు
మాస్టర్ సి.వి.వి. వారు చెప్పినట్లే 16 రోజుల తరువాత తిరిగి బ్రతికింది ఆమె.
ఈయన తెలిపే యోగం పూర్తిగా నూతన పద్దతి. దీనిని భృక్తరహిత తారక రాజయోగము అంటారు.
ఇతర యోగాల్లోని చాలా నిబంధనలు దీనిలో లేవు. అంతా కర్మ అనుకునే కర్మ యోగులు, “విధి” అనుకునే విధివంచితులు, గ్రహదోషం అంటూ గ్రహాలను నిందించవలసిన పని ఉండదు ఇందులో.
పరబ్రహ్మ ప్రసాదించిన యోగం సాధన చేసేవారిని ఏ దేవుళ్ళు, దేవతలు అడ్డుకోరు. ఏ దృష్ట శక్తులు అపకారం చేయవు.
మాస్టర్ గారు తానే మంత్రదేవతనన్నారు. అన్ని మంత్రాల ప్రయోజనాలు, ప్రభావాలు ఈ యోగ సాధనలో సిద్దిస్తాయంటారు.
ముందుగా సాధకుని లోపాలు చక్కబడతాయి. ఈయన చంద్ర మండలం విస్తరించి పది మైళ్ళు వెనక్కి వెళుతుందని చెప్పారు. ఆరు నెలల తరువాత సైంటిస్టులు నిజమేనని రుజువు చేశారు.
భూమి వంకరగా ఉందని అందుకని సూర్యుని వెలుగు చంద్రునిపై సరిగా పడటం లేదని, అందుకే కృష్ణ పక్షం వస్తోందని, వంకరపోతే ఎప్పటికి పొర్ణమి చంద్రుడే కనిపిస్తాడని ఈయన చెప్పారు.
ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలో భూమి 200 మైళ్ళు వంకరగా ఉన్నట్లు తేల్చారు. అంతటి సూక్ష్మ పరిశిలన మాస్టర్ గారిది.
మైనంపాటి నరసింహం, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఎక్కిరాల కృష్ణమాచార్య, శార్వరి…కొందరు మాస్టర్ గారి సాంప్రదాయం వారు.
తనను శరణువేడితే, పూర్వకర్మలన్నీ పోయి తరిస్తారు అంటారు మాస్టర్ సి.వి.వి.
ఆయన్ను తలిస్తే అన్నీ ఆయనే చూచుకుంటారని ఆయన భక్తుల నమ్మకం. సాయి కూడా నీవు నన్ను చూడు, నేను నిన్ను చూచెదను అంటారు.
మాస్టర్ సి.వి.వి. మే 12 1922న శరీరాన్ని త్యజించారు.
నేడు మే 12. మాస్టర్ గారి వర్థంతి దినం.
నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- చైతన్య గారిని మరణ శయ్య నుండి సాయి మరియు సాయి మాస్టర్ కాపాడిన అద్బుత లీల–Audio
- ఆరోగ్యం ప్రభాకరరాదిచ్చేత్ …. మహనీయులు – 2020… ఆగస్టు 29
- విన్నపాలు వినవలె…. …. మహనీయులు – 2020… మే 9
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- కాలిన మట్టి పాత్ర …. …. మహనీయులు – 2020… నవంబర్ 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments