కృష్ణారావు జగేశ్వర్ భీష్మ రెండవ భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

కృష్ణారావు జగేశ్వర్ భీష్మ రెండవ భాగం…

ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

శ్రీభీష్మ గురించి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అతను సమర్థుడైన డాక్టర్. ఆయన తన ఖాళీ సమయాలలో ప్రజలకు చికిత్స చేసేవారు. ఈ విధంగా శ్రీభీష్మ తన సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించారు.

ఒకసారి, “అస్పృశ్యత నివారణ్ పరిషత్” (అస్పృశ్యత నిర్మూలన సంస్థ) కార్యక్రమం మొహప్ప గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ కార్యక్రమంలో శ్రీభీష్మ మాట్లాడుతూ ‘ఒక అంటరాని వ్యక్తితో ఆహారం తీసుకోవడం’ అనే విషయంపై ఒక శక్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చారు. ఈ ప్రసంగంతో శ్రీ భీష్మను జాతీయనాయకుడిగా ప్రజలు చూడటం మొదలుపెట్టారు.

1908వ సంవత్సరం శ్రావణ మాసంలో, ఒక పౌర్ణమి రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతను తన నుదిటి మీద త్రిపుండ్ర రేఖలతో, ముదురు ఛాయలో(నల్లని వర్ణంలో) ఉన్న ఒక వ్యక్తిని చూశారు. అతని శరీరానికి కుంకుపువ్వుతో కలిపిన గంధం పూయబడి ఉంది. అతని పాదాలకు పూజ చేయబడినట్లు పాదాల చెంత పువ్వులు ఉన్నాయి. అతను భీష్మకు ఒక వార్తాపత్రికను ఇచ్చారు.

భీష్మ అతనిని మీరు ఎవరు అని అడిగారు. అతను ప్రత్యుత్తరం ఇవ్వలేదు, కానీ వార్తాపత్రికలో “సత్-చిత్-ఆనంద(సచ్చిదానంద)” అని పెద్ద అక్షరాలలో ప్రచురించిన పదాలను చూపించారు.  వాటిని చదివమని భీష్మకు సూచించారు. భీష్మ తన వార్తాపత్రికను చూసారు, అందులో “మంత్ర్ వా శిఖావా”(“మంత్రం నేర్చుకో”) అని వ్రాసి ఉంది.

భీష్మ కుతూహలంగా ఆ నల్లని వ్యక్తిని ప్రశ్నించాలని అనుకున్నారు, కానీ ఆ వ్యక్తి మరియు వార్తాపత్రిక రెండూ అదృశ్యమయ్యాయి. అదే సమయంలో తలుపు తట్టిన శబ్దం వినపడి భీష్మ కల చెదిరింది. ఆ తరువాత అతను తన కలను గురించి చాలాకాలం ఆలోచించారు కానీ, అందులోని రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు.

కొన్ని రోజుల తర్వాత గణేష్ భక్తుడైన సాధువు బోరి సందర్శించాడు. భీష్మ ఆ సాధువును కలిసి, తన కల గురించి వివరించారు. ఆ సాధువు “సత్-చిత్-ఆనంద(సచ్చిందానంద) స్వామి” అనునది అతని గురునామం అని, ఆయనే అలా స్వప్నదర్శనమిచ్చి “వా శిఖావా” అనే మంత్రముపదేశించి ఉండవచ్చని చెప్పారు.

కొంతకాలం తర్వాత భీష్మ అమరావతి సందర్శించటం జరిగింది. అక్కడ దాదాసాహెబ్ ఖపర్డే అతన్ని, “కలిసి వెళ్దాం, శిరిడీ వస్తారా?” అని అడిగారు. అతను అంగీకరించి ఖపర్డేతో కలిసి శిరిడీ వచ్చారు. ఖపర్డే  రెండవసారి 6 డిసెంబర్ 1911న శిరిడీ వచ్చి దీర్ఘకాలం గడిపినప్పటి ఖపర్డే డైరీలో భీష్మ గురించి ప్రస్తావించబడింది.

సాయిబాబా దర్శనం కోసం భీష్మ మశీదుకు వెళ్ళిన వెంటనే, సాయిబాబా తమ చేతులు జోడించి, “జై సత్-చిత్-ఆనంద!” అని అన్నారు. భీష్మ ఒక్కసారిగా ఆ మాట విని కలవరపడ్డారు. “నాకు కలలో కనిపించిన సాధువు సాయిబాబా కాదు కదా!” అని ఆయన ఆశ్చర్యపోయారు.

“కాని కలలోని సాధువు ఒక వైష్ణవుడు కదా! మరి సాయిబాబా ఒక ముస్లింగా కనిపిస్తున్నారు! అయినా ‘సత్-చిత్-ఆనంద’ అనే మాటలు ఎందుకు సాయిబాబా పలికారు?” అని సంశయంలో పడ్డారు.

రేపు తరువాయి భాగం….

తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

(Source: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015)

http://www.saiamrithadhara.com/mahabhakthas/krishnashastri_jageshwar_bhishma.html

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి  9704379333,   సాయి సురేష్ 8096343992

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles