మూలాస్వామి కొలువువద్ద ముక్తికాంత …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఎక్కడ నుండి ఊడిపడ్డాడోకాని, షిరిడీని తన నివాస స్థలంగా మార్చుకున్నాడు.

దొంతులమ్మ ఎక్కనుంది వచ్చిందోకాని మచిలీపట్నం తన నివాసం చేసుకుంది. సాయిబాబా, దొంతులమ్మ అసలు పేర్లు కావు.

ఆమె ఎప్పుడూ కుండల దొంతులను తలపై పెట్టుకొని తిరుగుటచే అందరూ ఆమెను దొంతులమ్మ అనేవారు.

ఆమెను నర్మదా తీరంలో నివసించే సూర్యనాయక్ బంజారా భార్య అని, పొలానికి అన్నం తీసుకుపోతుంటే ఒక యోగి దర్శనమిచ్చి “ఇప్పటినుండి నీవు సంసారిక బంధాలు విడచి సుజ్ఞాన దీక్షలో ఉండు. భర్త అనుజ్ఞ తీసుకుని రా” అన్నాడట.

ఆమె భర్తకు మరో వివాహం చేసి, అనుమతి తీసుకుని, ఆ యోగి వద్దకు వచ్చింది. ఆ యోగి ఆమెకు దీక్షనిచ్చాడు.

ఇక ఆమె అడవులు, నదులు దాటి శ్రీశైలంలో కొంతకాలముండి అవధూతగా మారి మచిలీపట్నం చేరింది.

మూలాస్వామి కొలిమి వద్ద ఆమె ఉండేది. ఏదో పిచ్చిదిలే అని మూలాస్వామి ఉపేక్షించాడు.

ఒకసారి యాదవుల అమ్మాయి మెడపట్టీ పారేసుకుంటే, ఆమె దానిని భద్రం చేసింది.

మూలాస్వామి ఆ పట్టీ తనకు కావాలన్నాడు. దానిని యాదవుల అమ్మాయికే ఇస్తాను అంది ఆమె. ఆమెను కొట్టటానికి కర్ర ఎత్తాడు. ఎత్తిన చేయి ఎత్తినట్లే ఉంది.

మూలాస్వామి ఆమె మహత్తును గుర్తించి, మన్నింపమన్నాడు. ఆమె మన్నించింది. తిరిగి మాములు వాడయ్యాడు మూలాస్వామి. ఇక ఆమె మహత్తు వ్యాపించింది.

ఆమెను ఎందరో ఆశ్రయించసాగారు. ఆమెను ఆశ్రయించిన వీరభద్రాచార్యులు తత్వానందస్వామిగా పేరుగాంచాడు.

కనుకొల్లు త్రివిక్రమరావు కుర్తాళం పీఠాధిపతి అయ్యాడు. ఆంధ్ర యోగుల చరిత్రను వ్రాసిన పంగులూరి వీరరాఘవుడు చిత్తశాంతి కరువై ఆమెను దర్శించాడు. శాంతి పొందాడు. రామకృష్ణాద్యవతారములతో పోల్చినాడాయన.

ఇలా ఎందరో వ్యక్తుల ఆధ్యాత్మికాభివృద్దికి తోడ్పడేది. ఐతే ఆమె వ్యక్తులను పరీక్షించి దీక్ష ఇచ్చేది.

ఒక తత్వజ్ఞాని వచ్చి ఆమెను ఉపదేశమిమ్మని కోరాడు. రాత్రి రెండు జాములకు స్మశానానికి రమ్మంది. అతను వచ్చాడు.

అతడు దోతులమ్మను చూస్తూనే ఉన్నాడు. ఆమె వెంటనే పెద్దపులిగా మారిపోయింది. అతడు ప్రాణ రక్షణకై పరుగు తీశాడు. అతడు ఉపదేశం పొందలేకపోయాడు.

పాండురంగ దాసు అనే సంకీర్తనకారుడు ఆమెను “మూలాస్వామి కొలువు వద్ద ముక్తికాంత” అని పాటలు పడేవాడు.

ఆ ముక్తికాంత ఫిబ్రవరి 9 (1932)న దేహం చాలించింది. అంతే, ఆమె సమాధినుండి పలకటం ప్రారంభించింది. ఆర్తుల కన్నీరు తుడుస్తుంది.

స్వప్నంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేస్తుంది. భక్తుల చేయిపట్టుకుని నడిపిస్తుంది.

నేడు ఫిబ్రవరి 9. ఆమె మహాసమాధి చెందిన దినం, ఆ మహా యోగినిని స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles