Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
యిపుడు క్లుప్తంగా తార్ఖడ్ కుటుంబం గురించి పరిచయం.
మా నివాస ప్రాంతం వాసీ ఫోర్ట్ (ఫోర్ట్ ఆఫ్ బాసీన్) దగ్గరున్న తార్ఖడ్ గ్రామం. అంధుచేత మా యింటి పేరు తార్ఖడ్ కర్. చరిత్ర ప్రకారం మా పూర్వీకులు, గొప్ప మరాఠీ యోథుడైన చిమాజీ అప్పాగారితో బాసిన్ కోట యుథ్థంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. పోర్చుగీస్ వారు ఓడిపోయారు. వారి ధైర్యానికి గుర్తుగా చిమాజీ అప్పాగారు తార్ఖడ్ గ్రామాన్ని జాగీరుగా యిచ్చారు. తరువాత బ్రిటీష్ వారు మరాఠాల నుంచి కోటని వశం చేసుకున్నారు. మా ముత్తాత గారయిన పాండురంగ తార్ఖడ్ గారు ముంబాయికి మకాం మార్చారు. ఆయన విల్సన్ కాలేజ్ దగ్గిర చర్నీ రోడ్ చౌపతీలో బంగళా కట్టుకున్నారు. పాండురంగ గారికి యిద్దరు కొడుకులు, దబోబా, మరియు ఆత్మారాం. వీరిలో దబోబా గారు ప్రముఖ వ్యాకరణకారుడు. మరాఠీ మాట్లాడేవారికి వ్యాకరణ పుస్తకాలు చక్కగా తప్పులు లేకుండా ఆంగ్ల భాషని రాయడం, మాట్లాడే, మరాఠీ వారికి వ్యాకరణ పుస్తకాలు రాసేవారు. రెండవ కొడుకయిన ఆత్మారాం వృత్తిరీత్యా వైద్యుడు. యింతకుముందు పని చేసిన ముంబాయి వైస్రాయి గారికి కుటుంబ వైద్యుడు.
మా తాతగారయిన రామ చంద్ర ఆత్మారాం గారు కాటన్ టెక్స్ టైల్ లో స్పెషలిస్ట్, యింకా ఖటావూ గ్రూప్ ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీ. ఆయన బాంద్రాలో తన నివాసాన్ని యేర్పాటు చేసుకున్నారు. తరువాత ఆయనకి శ్రీ షిరిడీ సాయి బాబాతో పరిచయం యేర్పడింది. షిరిడీ సాయి సంస్థాన్ యేర్పాటు చేసిన వారిలో ఆయన ఒకరు. దానికి మొట్టమొదటి కోశాథికారి కూడా. ముంబాయి, మహారాష్ట్ర ప్రజలకి బాబా సందేశాలనందిస్తున్న దాసగణు మహారాజ్ కి తనకు సాథ్యమయినంతలో సహాయం చేస్తూ ఉండేవారు. మీరు షిరిడీని దర్శించినప్పుడు సమాథి మందిరంలో, ఆ కాలంలో ఉన్నటువంటి భక్తుల ఫోటోలను చూడవచ్చు.
స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు వ్రాసిన సాయి సచ్చరిత్రలో ఆయన కాలంలో షిరిడీలో బాబా గారి సమగ్ర సమాచారం లభిస్తుంది. సాయి సచ్చరిత్రలోని 9 వ అథ్యాయం సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబానికి సంబంధించిన అనుభవాలని తెలియ చేస్తుంది. అందులో చెప్పిన తార్ఖడ్ స్త్రీ మా నాన్నమ్మ గారు, ఆమె కుమారుడు మా నాన్నాగారయిన శ్రీ జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్ గారు. ఈ పుస్తకంలో యిపుడు నేను చెప్పబోయే స్వీయానుభవాలు యెక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్ర గారివి. ఆయన 15 జూన్ 1895 లో జన్మించారు, 16 ఆగష్టు, 1965 లో మరణించారు. ఈ సందర్భంలో క్లుప్తంగా రచయిత గురించి పరిచయం యివ్వతగినది.
నా పేరు వీరేంద్ర జ్యోతిరాజా తార్ఖడ్. జ్యోతీంద్ర గారి రెండవ కుమారుడిని. (మొదటి కొడుకు రవీంద్ర మరణించాడు). వృత్తిరీత్యా నేను యింజనీరుని. నేను రెండు కంపెనీలలో, క్రాంప్టన్గ్రీవ్స్ కం పెనీ లి. లోనూ, సీమెన్స్ యిండియా లి.లోనూ మానేజర్ హోదాలో పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేసి శాంతా క్రజ్ లో ఉంటున్నాను.
(సం.) వీ.జే. తార్ఖడ్.
ఇక తార్ఖడ్ కుటుంబమువారి బాబా స్వీయానుభూతులలో మొదటి సాయి బాబా తో పరిచయం గురించి తెలుసుకుందాము.
శ్రీ సాయితో మొదటి కలయిక (పరిచయం)
ఈ సంఘటన ఒక వేసవికాలపు రోజున జరిగింది. జ్యోతీంద్ర అప్పుడే మెట్రో సినిమా దగ్గరున్న యిరానీ రెస్టారెంట్ లో ఫలహారం చేసి, తను చదివే సెంట్.గ్జేవియర్ స్కూలుకి వెడుతున్నాడు. స్కూలు విరామ సమయం లో యిరానీ రెస్టారెంట్ కి వెళ్ళి ఫలహారం చేయడం అతనికి ప్రతీరొజూ జరిగే కార్యకరమం. ఆ రోజు అతను రోడ్డు దాటుతున్నప్పుడు తెల్లని దుస్తులలో ఉన్న ఒక ఫకీరు అతన్ని పిలిచి ధర్మం అడిగాడు. జ్యోతిరాజా ఒక పైస నాణెం (రాగి నాణెం మథ్యలో కన్నం ఉండేది, దీనినే చిల్లు కాణీ అనేవారు) జేబులోంచి తీసి దానిని ఆ ఫకీరుకిచ్చి స్కూలుకు వెడుతున్నాడు. కాని ఆ ఫకీరు అతన్ని ఆపి, అది ఒక పైసా నాణెం 1894 సంవత్సరంలోనిది అని జ్యోతీంద్రతో అన్నాడు.
ఆ రోజులలో ప్రజలు ఒక పైసాను థర్మంగా యిస్తూ ఉండేవారు. ఆ విథంగా ఒక పైసా ఒక విద్యార్థి నుంచి ధర్మంగా ఇవ్వబడటం చాలా పెద్ద మొత్తం. జ్యోతీంద్ర, ఫకీరుతో, తనకి ప్రతీరోజూ మథ్యాన్న పలహారం నిమిత్తం నాలుగు అణాలు ఇవ్వబడతాయని, అందుచేత ఒక పైసా థర్మంగా ఇవ్వగలనని చెప్పాడు. అంతే కాకుండా ఈ ఒక పైసా ఇంకా చలామణిలోనే ఉంది కాబట్టి ఫకీరుకు దాని గురించి బెంగ అక్కరలేదని చెప్పాడు. అప్పుడా ఫకీరు “అల్లా భలా కరేగా” అన్నాడు. అప్పుడు జ్యోతీంద్ర స్కూలికి వెళ్ళిపోయాడు. యిక ఈ విషయం గురించి మరచిపోయాడు.
జ్యోతీంద్ర గారికి యిద్దరు అన్నయ్యలు. సత్యేంద్ర, రవీంద్ర. వీరు మెడికల్ కళాశాలలో చదువుతూ ఉండేవారు. సత్యేంద్ర గారు యింకా జీ.జీ.ఎం.సీ. (గ్రాడుయేట్ మెడికల్ కాలేజ్ – యిదే తరువాత ఎం.బీ.బీ.ఎస్. గా రూపాంతరం చెందింది) డిగ్రీ సాథించారు. ఆయన రచయితకు పెదనాన్న, ఈయన మాతుంగాలోని కొంకన్ నగర్ లో ఉండేవారు. (యిప్పుడాయన లేరు. ఆయన కొడుకు, కూతురు అక్కడ ఉంటున్నారు.) జ్యోతీంద్ర గారి సోదరుడు డాక్టరు, ఆయన మామయ్య డాక్టరు ఆయన తాతగారు ప్రముఖ మెడికల్ ప్రాక్టీషనరే కాకుండా బొంబాయి వైస్రాయిగారికి కుటుంబ వైద్యుడు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతీంద్రగారికి అది వైద్యుల కుటుంబం.)
కాని జ్యోతీంద్రగారి కుటుంబంలో యింతమంది వైద్యులు ఉన్నాగాని, జ్యోతీంద్ర గారి తల్లి అంటే రచయితగారి నాన్నమ్మగారికి మైగ్రైన్ తో విపరీతమయిన తలనొప్పితో బాథపడుతూ ఉండేది. అన్ని రకాల మందులను వాడి చూశారు, కాని అది యింక నివారణ కాదని తేలిపోయింది, వారింటిలో వారితో కలిసి పని చేస్తూ ఒక పనిమనిషి ఉండేది. ఆమె, బాంద్రా మసీదు దగ్గరున్న పీర్ అని పిలవబడే మౌలానా బాబా వద్దకు వెళ్ళమని సలహా యిచ్చింది. ఆయన కొన్ని ఆయుర్వేద మందులిస్తారని, నయమవని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పింది.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు మొదటి భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై మూడో భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు మూడవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేడవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదవ భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు రెండవ భాగం”
kishore Babu
August 22, 2016 at 5:43 pmThank you so much Sai Suresh…