గురువులంతా ఒక్కటే …. మహనీయులు – 2020… జూన్ 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఏ ఆశ్రమాన్ని స్థాపించలేదు కాబట్టి తన అనంతరం ఆ ఆశ్రమాన్ని ఎవరు నడపాలో నిర్ణయించలేదు.

చిత్రపూర్ మఠానికి 52 ఏండ్లుగా గురుత్వాన్ని నిర్వహించిన స్వామి పాండురంగాశ్రం, ఇక తాను దేహాన్ని విడిచిపెట్టే 9 రోజుల ముందు, పీఠాధిపతిని  నిర్ణయించాడు.

శాంతమూర్తి హరిదాసభట్ స్వామి ఆనందాశ్రం   అయ్యాడు తన 13 ఏటనే.

ఆనందాశ్రం జ్ఞానార్జన కోసం హిమాలయాల గురువుల నాశ్రయించాడు. జ్ఞానాన్ని పొందాడు. ఛాందసపు ఆచారాలను నిరసించాడు.

శిష్యుడుగా ఉండాలనే కోరిక ఒకటే చాలదు శిష్యునిగా ఉండటానికి. ఇక గురువుగా ఉండవలసి వచ్చిననాడు, తాను మార్గదర్శిగా ఉండాలి. అదే స్వామి ఆనందాశ్రం చూపారు.

ఒకసారి ఆనందాశ్రం తన శిష్య బృందంతో ఒక కారులో అంబే ఘాట్ దాటుతున్నారు. అది రాత్రి సమయం.

ఆనందాశ్రం కారును నడుపుతున్నారు ఎక్కడి నుండో ఒక పెద్దపులి వచ్చి రోడ్డుకు అడ్డంగా  పడుకుంది. అది హారన్ మోత వినికూడా తొలగిపోలేదు.

కారులో ఉన్న భక్తులంతా ఆదుర్దాపడుతున్నారు. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. ఆనందాశ్రం తన కారు నుండి దిగారు.

సరాసరి ఆ పెద్దపులి వద్దకు వెళ్ళారు. ఆ పెద్దపులి చెవిలో “మేము గమ్యస్థానాన్ని చేరాలి. దయచేసి దారి విడు” అన్నారు.

ఆ పెద్దపులి తనకేదో అర్థమైనట్లుగా, లేచి గబగబా వేరే దిక్కుకు పోయింది. కారులోని వారంతా బ్రతుకు జీవుడా అనుకున్నారు. ఆనందాశ్రం తన గురుస్థానానికి వన్నె తెచ్చారు ఈ సంఘటనతో.

సాయిబాబా ఒక పొగరుబోతు గుర్రాన్ని సాధు జంతువుగా మార్చారు. గజానన్ మహారాజ్ కూడా అంతే. అసలు గురువులంతా ఒకటే అనిపిస్తుంది. అదే తెలుసుకొనవలసింది.

ఒక భక్తుడు ఆనందాశ్రం వద్దకు వచ్చారు. కాని ఆనందాశ్రం ఆరోగ్యం బాగుండకపోవటంతో ఎవరికి దర్శనం దొరకలేదు.

ఇక ఆ భక్తుడు ఒక గురువు (సత్య సాయిబాబా) వద్దకు వెళ్ళాడు. ఆయనను దర్శించుకున్న తరువాత, ఆ భక్తుడు బయలుదేరబోయాడు. ఆ భక్తునకు ఆ గురువు అక్షింతలను ఇచ్చాడు. అక్షింతలను ఇచ్చేది ఆనందాశ్రం.

ఈ గురువు ఎప్పుడూ ఇచ్చేది ఊదీ. ఇదేమిటా? అనుకుని, తిరిగి ఆనందాశ్రం దర్శనానికై వెళ్ళాడు.

ఈసారి ఆ భక్తునకు ఆనందాశ్రం దర్శనం దొరికింది. ఇక వెళ్ళబోయే ముందు ఆనందాశ్రం తాను ఎప్పుడూ ఇచ్చే ఆక్షింతలకు బదులుగా ఊదీ నిచ్చారు.

అప్పుడు ఆ శిష్యునకు అర్థమైంది. గురువులు వేరు వేరుగా భౌతికంగా కనిపించిన వారి తత్వం ఒకటేనని.

ఇలా 51 సంవత్సరాలు గురుత్వాన్ని చేపట్టినారు ఆనందాశ్రం. ఈయన జన్మదినం జూన్ 29. 1902.

నేడు జూన్ 29. ఆనందాశ్రం జయంతి. ఆయనను స్మరిస్తూ, సద్గురువులంతా ఒకటేననే భావం మనకు కలుగుతుందని ఆశిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles