Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పందిట్లో పెండ్లి జరుగుతోంది. అంతా ఆనందంగా ఉన్నారు. కాని పెండ్లి కుమార్తె తండ్రి ఒక గదిలో ఉన్నాడు. ఆయన చివరి క్షణాలలో ఉన్నాడని కొందరు గ్రహించారు.
కొందరు తమకు తెలిసిన గోపీనాథ్ వద్దకు వేగంగా వెళ్ళి పెండ్లి కుమార్తె తండ్రి ప్రాణం పోయేటట్లు ఉందని, అలా జరిగితే పెండ్లి ఆగిపోతుందని ఆవేదన వెలిబుచ్చారు.
“రేపటిదాకా ఆగమను” అన్నారు గోపీనాథ్. గోపీనాథ్ కూడా ఆ పెండ్లి వారి వెంట పెండ్లికి హాజరయ్యాడు.
గోపీనాథ్ అక్కడ ఉండగా చెడు ఏమీ జరగదని భక్తుల నమ్మకం. పెండ్లి సక్రమంగా జరిగింది.
మరునాడు మధ్యాహ్నం దాటిన తరువాత ఆ పెండ్లి కుమార్తె తండ్రి కాలధర్మం చెందాడు. ఇంతకు గోపీనాథ్ ఆగమన్నది ఎవరిని? కాలుడైన యమధర్మరాజునే.
ఒకనాటి రాత్రి జోరున వర్షం కురవసాగింది షిరిడీలో.
అదే సమయంలో కొందరు బాబా భక్తులు వారి గృహాలకు ఎలా వెళ్ళాలా అని మధనపడుతుంటే బాబా “రుఖజావ్ మేరా బాల్ బచ్చా ఘర జానేవాలా హు” అనగానే వర్షం ఆగిపోయింది.
ఒకసారి గోపీనాథ్ కొందరితో కలసి భోజనం చేస్తున్నారు, గోపీనాథ్ మహారాజ్ అకస్మాతుగా ఒక భక్తుని చేతిపై చెంచాతో పొడిచారు.
రక్తపు బొట్లు కారుతుండగా, ఆ వ్యక్తి వెంటనే బయటకుపోయి ప్రథమ చికిత్స చేయించుకుని తేరుకున్నాడు.
ఎందుకు గోపీనాథ్ అలా చేశారో ఎవరికీ అర్ధంకాలేదు. ఎవరో ఆ భక్తుని జాతకాన్ని చూచి, ఆ దినం అతనికి గండం ఉందని, రక్తం వస్తుందని చెప్పారు.
గొలగమూడి వెంకయ్యస్వామిగారు చెప్పినట్లు గడ్డపారతో గాయమవలసి నప్పుడు, సూది మొనంత గాయంచేసి ఆపదను పోగొడతారు సత్పురుషులు.
కాశ్మీరులో ఎందరో సత్పురుషులు జన్మించారు. వారిలో గోపీనాథ్ మహారాజ్ కాశ్మీరీ ప్రజలచేతనే కాకుండా, దేశ విదేశాలలో భగవాన్ గోపీనాథ్ గా పూజింపబడుతున్నాడు.
ఆయన తన జీవితంలో సాధన చేసి, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పటినుండి, తుదివరకు జనులను ఆధ్యాత్మిక బోధనలే కాకుండా, బౌతికంగా కూడా అభివృద్ధి చెందేటట్లు చేశారు.
ఆయన కఠోరమైన సాధనచేసి, చిత్ర విచిత్ర రీతులలో దీక్షను ఇచ్చేవారు. వాక్కుతో, స్పర్శతో దీక్షను ఇచ్చేవారు.
ఆయన చిలుము పీల్చేవారు. ఒకసారి ఒక విదేశీయునికి పీల్చమని తన చిలుంను ఇచ్చారు. ఒకసారి చిలుం పీల్చగానే, ఆ విదేశీయుని కుండలి జాగృతమైంది.
భగవాన్ గోపీనాథ్ కాశ్మీరులో ఉన్నా లేక మరెక్కడున్నా ధునిని వెలిగించేవారు. ఊధీనే ప్రసాదంగా ఇచ్చేవారు.
అది అనేక వ్యాధులను నయం చేసేది. సాయిబాబా కూడా తన భక్తులకు ఊధీని పంచేవారు.
ఆ మహిమాన్విత ఊధీ ఎందరో అనారోగ్యులను ఆరోగ్యవంతులుగా చేసింది.
జూలై 3 , 1898న జన్మించిన గోపీనాథుల వారు భౌతిక కాయాన్ని 28 మే, 1968లో విసర్జించినా కాశ్మీరులొని వారి సమాధి నేటికి సమాధానాలు చెబుతూనే ఉంది సాయి సమాధి వలె.
నేడు భగవాన్ జయంతి. ఆయనను స్మరించెదము గాక!
“ఓం నమో భగవతే గోపీనాథాయ …”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం నమో భగవతే నిత్యానందాయ… మహనీయులు – 2020… జూలై 30
- ఓం నమో భగవతే శ్రీధరాయ! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 19
- కాని భర్త అడుగుజాడల్లో…. మహనీయులు – 2020… అక్టోబరు 18
- గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9
- ఓం జయ జగదీశ హరే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 30
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments