అన్నదాత్రీ సదా కృతార్థా …. మహనీయులు – 2020… ఆగస్టు 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా అన్నదానానికి స్వయంగా కష్టపడి వండి వార్చేవాడు. తెలుగు వారిలో అన్నదానం చేసి ప్రసిద్ధి పొందిన వారిలో ముఖ్యులు డొక్కా సీతమ్మ గారు, కైవారం బాలాంబ గారు.

వితంతువైన బాలాంబ గారు కేశములతో ఉండటం కొందరికి గిట్టలేదు. ఇటువంటి పరిస్థితి తరిగొండ వెంగమాంబ గారి జీవిత చరిత్రలో కూడా కానవస్తుంది.

శిరోముండనము చేయవచ్చిన మంగలికి, బాలాంబగారి స్థానంలో పులి కనిపిస్తే అరుస్తూ పారిపోయాడు. ఆమెకు నృసింహుని దీవెన ఉందని అందరూ గ్రహించారు.

బాలాంబను ఒక బాలుడు అన్నము అడిగాడు. “నీకు అన్నము పెట్టలేని నిరుపేదరాలిని” అన్నది ఆమె.

“నీ చేత అందరికి అన్నం పెట్టిస్తాను” అని ఆ బాలుడు అదృశ్యుడయ్యాడు. ఆ బాలుడు నరసింహుడని ఆమె నిశ్చయము.కాదనువారెవరు?

ఇక ఆమె అన్నదానమునకు నడుము కట్టింది. విశేషించి ఆమె నిరతాన్నదానాన్ని మంగళగిరిలో చేసేది.

కుల, మత వివక్ష చూపకుండా అన్నదానం చేసేది. షడ్రసోపేతమైన భోజనాలు పెట్టేది.

ఒకప్పుడు తనకు కేశ ఖండనము చేయవచ్చిన మంగలికి తానే వడ్డించి, తినిపించింది.

ఫాల్గుణ శుద్ధ త్రయోదశినాడు నాలుగు వేల మంది భోజనానికి కూర్చున్నారు. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమైంది.

బాలాంబ మేఘనికి కర్పూర నీరాజనం సమర్పించి, చేతులు జోడించి నమస్కరించింది. వర్షము ఆగిపోయింది. భక్తులు సంతసించి కడుపునిండా భుజించారు.

మరొకనాడు అన్నదానము జరుగుచున్నది. వడ్డించు వారు చూడగా, నేతి డబ్బాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని బాలాంబగారి దృష్టికి తెచ్చారు.

ఆమె వెంటనే కోనేటి ఒడ్డుకు వెళ్లి, పానకాలరాయునకు హారతి ఇచ్చింది. మంగళగిరి రైల్వే స్టేషను నుండి పోర్టరు, సెల్ఫ్ ఆర్దరుతో వ్రాయబడిన పాసుతో నేతి డబ్బాలను ఆమెకు సమర్పించి, రసీదు తీసుకొని వెళ్లిపోయాడు.

మరొకసారి పంగులూరు వీర రాఘవుడు ఆమెను దర్శించారు. ఆమె వారికి భోజనము ఏర్పాటు చేసింది. అరిసెలు, పెరుగు, గారెలు భోజనములో వడ్డించింది. లడ్లు తినిపించింది.

ఖాళీ లేదు ఎటుల తిందును అనగా ఆయనచే మూడు పర్యాయములు నృసింహ నామ మంత్రోచ్చరణ చేయించింది.

కడుపు వెలితిగ నుండుట ఆయన గమనించి, మరల తృప్తిగా భుజించారు. ఆయనకు సందేహం కలిగింది.

ఇది బాలాంబగారి ప్రభావమా? నృసింహ మంత్ర ప్రభావమా? అని. వెంటనే ఆయన అవి అభిన్నము, ఏకము అని గ్రహించాడు.

ఆ  మహా అన్నదాత్రి ఆగస్టు 12 (1944)న నరసింహునిలో ఐక్యమైంది.

నేడు ఆగస్టు 12. ఆమెను నృసింహుని స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles