Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
తీర్ధ యాత్రలు చేయడానికి వెళ్ళే ప్రతీ సామాన్యునిలాగానే శ్రీరామస్వామి అయ్యంగారు నారాయణ మొదలియార్ (డాక్టరు) షిరిడీ కి వెడదామని నిర్ణయించుకున్నారు. అందరిలాగానే తను కూడా తన కిష్టమయిన ఆహార పదార్ధాన్ని గాని, అలవాటును కాని వదలివేయాలనుకున్నారు.
శ్రీ షిరిడీ సాయిబాబావారి గొప్పతనాన్ని విని, రామస్వామి అయ్యంగారు నారాయణ్ మొదలియార్ (డాక్టర్) గారు, రావు సాహెబ్ సుబ్బయ్య చెట్టియార్ గారితో కలసి 1938 సంవత్సరం, ఏప్రిల్, 27వ.తేదీన షిరిడీకి ప్రయాణమయ్యారు. కాశీ, రామేశ్వరం పుణ్యక్షేత్రాల యాత్రలాగా తన షిరిడీ యాత్ర కూడా ఒక మధురానుభూతిగాను, ఫలప్రదంగాను మిగిలిపోవాలనుకొన్నారు.ఈ విధంగా అనుకొని ఆయన, తనకు ఉన్న విపరీతమయిన అలవాటయిన కిళ్ళీ నమలడం మానివేస్తానని భీకరమయిన ప్రతిజ్ఞ చేశారు. ఇక చివరిసారిగా ఆక్షణం నుండి షిరిడీ విడిచి వెళ్ళేవరకు తాంబూలం వేసుకోరాదనె నిర్ణయం తీసుకొన్నారు. కిళ్ళీ వేసుకోవడం ఆయనకు చిన్న తనం నుండీ ఉన్న అలవాటు. అటువంటిది కిళ్ళీ మానేయడమంటే ఆయన దృష్టిలో అది పెద్ద త్యాగమే.
అలా అనుకోగానే కిళ్ళీ వేసుకోవడం మానివేసి, 1938, ఏప్రిల్, 28 తేదీన చెట్టియార్ గారితో కలసి, ఒక ఎడ్లబండిలో షిరిడినుండి తిరుగు ప్రయాణమయ్యారు. వారిద్దరూ బండిలో కూర్చొగానె చెట్టియార్ గారు కిళ్ళీ నమలడం మొదలుపెట్టారు. షిరిడీలో అంతవరకు కిళ్ళీ వేసుకోవాలని కోరికతొ మనసు లాగినా దానిని జయించారు. కాని యిప్పుడు చెట్టియార్ గారిని చూసిన తరువాత ఒట్టు కాస్తా గట్టున పెట్టి మద్రాసు చేరుకున్న క్షణం నుండీ మానేయవచ్చులే అనే ఆలోచన కలిగింది. ఆకులు, వక్క ఉంఛే చిన్న పెట్టెలోనుండి ఆకులు, వక్క, సున్నం తీసుకొని ఆనందంగా నమలడం మొదలు పెట్టారు. ఎప్పుడయితే కిళ్ళీ నమలడం మొదలు పెట్టారో నాలిక వెంటనే పొక్కిపోయింది. ఎన్నో దశాబ్దాలనుండి కిళ్ళీలు నమిలి నమిలి ఆయన నాలుక బండబారిపోయి బండలాగ తయారయింది. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. కాని దానినేమీ పట్టించుకోకుండా తనివితీరా నమిలారు. ఒక అరగంట గడిచాక తన నాలుక, నోరు బాగా ఎఱ్ఱ బారి ఎన్నడు లేని విధంగా చాలా అసాధారణంగా కందిపోయాయి.అప్పటినుండీ తమలపాకులే కాదు ఘనపదార్ధాలేమి నమలలేకపోయారు. ఆయనకు కనీసం గ్యాస్ ప్రోబ్లెం కూడా లేదు. ఆరోజునుండి 18 రోజులదాకా తమలపాకులతో సహా మిగిలిన ఘనపదార్ధాలన్నిటినీ, నోటిపూత కారణంగా ఆయన మానుకోవలసి వచ్చింది. ఒట్టిపాలు మాత్రమే త్రాగేవారు.
చెట్టియార్ గారిని చూస్తుంటే ఆశ్చర్యం అంతకంతకూ పెరగసాగింది. తామిద్దరూ ఒకే తమలపాకులు, సున్నం తో కిళ్ళీలు వేసుకొన్నారు. మరి ఆయనకు లేని సమస్య తనకెందుకు వచ్చినట్లు? కాని నేను వాగ్దానం చేసినట్లుగా ఆయన చేయలేదు. కిళ్ళీ నమిలిన గంట తరువాత ఆయనకు మరొక అనుభవం ఎదురయింది. ఆయన తనతో కుడా తమలపాకులు వేసుకొనే చిన్న బుట్ట, వక్కలు, సున్నం పెట్టుకొనేందుకు చిన్న వెండి కప్పు, ఈ సరంజామానంతా తెచ్చుకొన్నారు. (తమిళులు ఇటువంటివన్నిటినీ ఒక చిన్న పెట్టెలో పెట్టుకొని కూడా పట్టుకెడుతూ ఉంటారు) వాటిని చెట్టియార్ గారి వద్ద పెట్టి కొన్ని తమలపాకులు, యింకా కొన్ని సరుకులు కొనుక్కొని రావడానికి రత్నా బజారుకు వెళ్ళారు. కొద్ది నిమిషాలలోనే తిరిగి వచ్చారు. తను పెట్టిన తమలపాకులు,సున్నం డబ్బా కోసం చూశారు. వావ్! ఏముంది? అక్కడ తన సరంజామా ఏమీ కబపడలేదు. అక్కడికి దొంగ ఎవరూ రాలేదు. వాటినన్నిటినీ చెట్టియార్ గారి దగ్గరే పెట్టారు. ఎంత వెతికినా గాని అవి కనపడలేదు.
పై రెండిటి సంఘటనలు జాగ్రత్తగా గమనిస్తే బాబా గారు యింకా జీవించే ఉన్నారని ఆయనకర్ధమయింది. ఆయన తన భక్తులనందరినీ స్వంత బిడ్డలవలె చూసుకొంటారు. అంతే కాక క్రొత్తగా వచ్చిన భక్తులని కూడా ఎంతో ప్రేమతోను చాలా జాగ్రత్తగాను కనిపెడుతూ రక్షిస్తున్నారని గ్రహించారు.
శ్రీసాయినాధులవారికి భయభక్తులతో ఏదయినా మాట యిచ్చి తప్పితే, అలా మాట ఇచ్చి తప్పినవారిని శిక్షించి క్రమశిక్షణలో పెడతారు. ఆయన తన భక్తులు ఉన్న పరిస్థితులు, పరిసరాలు అన్నిటినీ ఎల్లప్పుడు గమనిస్తూ ఉంటారు. తనభక్తులు ఎప్పుడు ఏవిషయంలోను అతిక్రమించి దారి తప్పకుండా నిత్యం గమనిస్తూ ఉంటారు.
బాబా ఆయనకి మంచి గుణపాఠం నేర్పారు. ఆరోజునుండి ఆయన యిక ఎప్పుడూ యిచ్చిన మాట తప్పలేదు. ఆవిధంగా బాబా ఆయనలో విశ్వాసాన్ని పెంచి, ఆయన చేసిన వాగ్దానాన్ని అమలు పరచే మనోధైర్యాన్ని ప్రసాదించారు. ఆయన షిరిడి దర్శనానికి ముందు బాబా ఔన్నత్యాన్ని గురించి, ఆయన దయాగుణం గురించి విన్నారు, కాని అవి ఆయన మదిలో ఒక అస్పష్టమయిన ముద్రను వేసింది. కాని వాస్తవంగా పొందిన ఈ అనుభవం బాబా మీద ఆయనకున్న అభిప్రాయం మరింత స్పష్టంగాను, శక్తివంతంగాను ఆయన జీవితాంతం వరకు నిలబడిఉంటుంది. ఆయన తన దృష్టినంతా బాబా మీదనే కేంద్రీకరించారు.
ఆంబ్రోసియా ఆఫ్ షిరిడీ నుండి
రామలింగస్వామి
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
0 comments on “మాట ఇచ్చి తప్పినచో భగవంతుడే స్వయంగా గుర్తు చెస్తాడు–Audio”
kishore Babu
August 22, 2016 at 5:21 pmThank you So much Sai Suresh..