ఒక అడుగు ముందుకు వెయ్యి …. మహనీయులు – 2020… జూన్ 23



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


యశుడు కాశీలోని కోటీశ్వరుని కుమారుడు. అన్ని భోగాలు యశునివే.

విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడా యువకుడు. ఒకనాటి ఉదయం అందరికంటే ముందుగా నిద్రలేచాడు. ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూచాడు.

ఆతని స్త్రీ పరిచారికలు, సంగీతకారులు వివిధ భంగిమలలో నిద్రిస్తున్నారు. ఎంతో జుగుప్స కలిగింది ఆ దృశ్యాన్ని చూసి.

ఇదా జీవితం అనుకున్నాడు. దర్పంగా జీవించటం, ధర్మబద్ధంగా జీవించటం అతనికి కన్నులకు కట్టినట్లు కనిపించింది.

ఎంతో ఆందోళనతో “నాకు చాల బాధాకరంగా ఉంది. ఇది నేను భరించలేను” అనుకుంటూ ఇసి పట్నం వైపు వెళ్ళాడు.

సాయిబాబా సచ్చరితలో “ఇహ పర లోకములందుగల గౌరవములకు, విషయములకు విసుగు చెందినగాని పారమార్థికములో ప్రవేశించుటకు హక్కులేదు” అంటారు ప్రత్తి నారాయణరావుగారు.

అంటే ఇప్పుడు యశుడు పారమార్థికములో ఉన్నాడు.

అతడు నడవగా నడవగా ఆశ్రమము బయట బుద్ధుడు కనిపించాడు. యశుడు ఆయనను సమీపించాడు. “నాకు చాల బాధాకరంగా ఉంది. నేను భరించలేను” అని వాపోయాడు.

“ఓయసా (యశుడా) ఇక్కడ ఏ భాధలు లేవు. ఇక్కడ సహ్యాంకానిది ఏమి ఉండదు. ఇలా దగ్గరకురా ఓయసా! కూర్చో, నేను నీకు ధర్మ బోధ చేస్తాను” అన్నాడు బుద్ధుడు.

బుద్దుడు ధర్మ బోధ చేశాడు. యశుడు సన్యాసత్వంలోని మొదటి దశ అయిన సాతపత్తిని పొందాడు. యశుడు విని అర్థంచేసుకో గలిగాడు.

సాయిబాబా ఒక అడుగు ముందుకు నీవు వేస్తే, పదడుగులు నేను వేస్తాను అంటారు. బుద్ధుని విషయం కూడా అంతే.

యశుడు బుద్ధుని వద్ద ఉన్నట్లు యశుని బంగారు చెప్పులను చూచి గూఢచారులు గుర్తించి, ఆ విషయాన్ని చెప్పారు కోటీశ్వరునికి.

కోటీశ్వరుడు బుద్ధుని ఆశ్రమం వద్దకు వచ్చాడు. బుద్దుడు తన మనో శక్తితో యశుని తండ్రి రావటాన్ని చాలా దూరం నుండి గమనించాడు.

యశుని చూడకుండునట్లు బుద్ధుడు సంకల్పించాడు. యశుడు అక్కడే ఉన్నా కనిపించలేదు ఆతని తండ్రికి. “మీరు నా పుత్రుని చూశారా?” అని ప్రశ్నించాడు యశుని తండ్రి.

“మంచిది ఇలా కూర్చోండి. మీ పుత్రుని చూడగలుగుతారు” అన్నాడు బుద్ధుడు.

ఆయన సంతోషంగా కూర్చొని బుద్ధుని ధర్మం విన్నాడు. ఆయన “నేను, ఓ దేవా! బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి,

ఈ రోజు నుండి నేను జీవితాంతం మీ శరణు పొందుతాను. నన్ను తన అనుమాయిగా స్వీకరించండి” అని వేడుకున్నాడు బుద్ధుడిని.

సూత్రత్రయంలో శరణువేడిన ప్రథమ వ్యక్తి యశుని తండ్రే. యశుని చూడటానికి వీలుగా బుద్ధుడు తన సంకల్ప శక్తిని ఉపసంహరించాడు. కోటీశ్వరుడు తన కుమారుని (యశుని) చూచి సంతసించాడు.

తేదీ వివరాలు తెలియవు.

ఇది బుద్ధ మాయ!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles