Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
జ్ఞానేశ్వరుడు తన సోదరుడైన నివృత్తి దేవుని గురువుగా స్వీకరించాడు. నీలకంఠ దీక్షితుడు సాక్షాత్తు ఈశ్వరరూపుడైన అప్పయ్య దీక్షితుని సోదరుడు.
ఒకనొక సమయంలో ఆస్తి పంపకం విషయం వచ్చింది. ఆ సమయంలో నీలకంఠ దీక్షితులు తనకు జ్ఞానభిక్ష ప్రసాదింపుమని, వేరే ఆస్తి అక్కరలేదని అప్పయ్య దీక్షితుని కోరుకున్నాడు.
అప్పయ్య దీక్షితుడు సంతసించి, జ్ఞానమునే కాదు, ప్రాపంచిక సంపదను కూడా ప్రసాదించాడు. ఐతే నివృత్తినాథుడు జ్ఞానేశ్వరునకు ప్రాపంచిక సంపదను ప్రసాదించలేదు.
ఒకసారి నీలకంఠుడు దేవి మహాత్య్మమును వివరించి చెబుతున్నాడు. పాండ్య రాజైన తిరుమల నాయకుడు ఆ సమయాన అక్కడ ఉండటం తటస్థించింది.
అంత చిన్న వయసులో ఆధ్యాత్మిక విషయాలను కూడా అరటిపండు వలచి నోటికందించినట్లు చెబుతున్న నీలకంఠుని తన ముఖ్య మంత్రిగా చేసుకుందామనే ఆలోచన కలిగింది.
పాండ్య రాజైన తిరుమల నాయకుడు కూడా భక్తి భావములున్న రాజు. నీలకంఠుడు ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు. ముఖ్య మంత్రిగా ఉండసాగాడు.
రాజ మందిరంలో ఉన్నా, ఆధ్యాత్మికతను కనుమరుగు కానివ్వలేదు. పరిశుద్దమైన, నీతి, నిజాయితీలతో జీవితాన్ని కొనసాగించేవాడాయన.
ఆత్మానందాన్ని పొందిన వాడికి. కొరత ఏమి ఉంటుంది? నీలకంఠునికి రాని విద్య అంటూ లేదు.
సుందరమూర్తి పాండు మంటపానికి శిల్పి. అయన మహా శిల్పి. ఐనా ఆ రాజు గారి భార్య శిల్పాన్ని చెక్కలేకపోతున్నాడు. ఈ విషయాన్ని నీలకంఠులవారు గ్రహించారు.
రాణి గారి శిల్పంలో కుడి తొడపై ఒక అతి చిన్న రతి పెచ్చు ఊడిపోయింది. ఎన్ని విధాలా ప్రయత్నించినా ఆ పెచ్చు స్థానాన్ని పూరించటం కష్టమయ్యింది.
నీలకంఠుడు ఆ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్నదని, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చెప్పాడు సుందరమూర్తికి.
రాజుగారికి ఈ సంగతి తెలిసింది. రాణిగారి కుడి తొడపై ఉన్న పుట్టుమచ్చ, నీలకంఠుల వారికి ఎలా తెలిసింది, అని నీలకంఠులవారిపై అనుమానం వచ్చి, నీలకంఠులను బంధించామని ఆజ్ఞ నిచ్చాడు భటులకు.
ఆ సమయంలో మీనాక్షి దేవికి హారతి ఇస్తున్నాడు నీలకంఠుడు. నీలకంఠుని అంతర్నేత్రం రాజు అపోహను తెలిపింది.
వెంటనే ఆ ఆరతి పళ్లెంలో మరింత కర్పూరం వేసి, మీనాక్షి దేవికి ఆరతి ఇచ్చి, ఆ ఆరతి మంటలలో తన కన్నులను పోగొట్టుకున్నాడు.
సాయి కరుణతో కంటి దృష్టిని అంధులకు ప్రసాదించాడు. భక్తుల కోరికలు తీర్చుట సాయి, మాతల కర్తవ్యం.
ఈ వార్త తెలిసినా రాజు పశ్చాత్తాపంతో కృంగిపోయాడు.
నీలకంఠ దీక్షితులు మీనాక్షి దేవిని 105 శ్లోకాలతో ప్రార్ధించాడు. కన్నులు తిరిగి వచ్చాయి అమ్మ దయవలన. అందరు సంతోషించారు. తేది వివరాలు లభించలేదు
అమ్మ అనుగ్రహమును మనమూ పొందెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జయ జగదీశ హరే! … మహనీయులు – 2020… జూలై 27
- దొంగకు చిక్కిన రంగనాథుడు …. మహనీయులు – 2020… నవంబర్ 5
- మూలాన్ని చూడు…. మహనీయులు – 2020… సెప్టెంబరు 7
- గడపనైనా కాకపోతిని …. …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 26
- దేహమే దేవాలయం… …. మహనీయులు – 2020… ఆగస్టు 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments