మానవ జన్మ…. మహనీయులు – 2020… ఆగస్టు 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా లక్ష్మీబాయి కపర్డే గత జన్మలను గూర్చి చెప్పారు. ఆమె గత జన్మలో ఆవుగా జన్మించి, తదుపరి జన్మలలో మానవ జన్మ ఎత్తింది.

జైన మతంలోని మహావీరుడు కూడ మేఘ కుమారుని గత జన్మను చెప్పారు.

మగధ రాజ్యాన్ని శ్రేణిక్ అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ధరణి ఆయన మహారాణి.

ఒకనాడు ఆమెకు స్వప్నంలో ఒక ఏనుగు ఆమె నోటిలో ప్రవేశించినట్లు కలగన్నది. ఆ స్వప్నం మంచి స్వప్నమని అందగాడు, విద్యలలో ఆరితేరిన వాడు ఆమెకు జన్మిస్తాడని జాతకులు చెప్పారు.

ఆమె గర్భిణి. మూడవ నెలలో ఆమెకు ఒక చక్కని ఏనుగుపై ఆకాశం మేఘములతో నిండి ఉండగా, సంచారం చేయాలనే కోరిక కలిగింది.

ఆకాశంలో రంగు రంగుల మబ్బులు పోతుండగా, రాణి ఏనుగుపై తనివితీరా పయనించింది. పండంటి కుమారుని కన్నది.

ఆ బిడ్డడికి మేఘ కుమార్ అనే పేరు పెట్టారు. చిన్న వయసులోనే సర్వ కళలు నేర్చుకున్నాడు.

ఒకనాడు మహావీరుడు జైన మతాన్ని గూర్చి బోధిస్తుంటే, మేఘ కుమార్ విన్నాడు.

తాను జైన సన్యాసిగా మారతానని తల్లి దండ్రులకు చెప్పి వారి అనుమతితో మహావీరుని వద్దకు వెళ్లి సన్యాసిగా మారాడు.

అతడు జైన సన్యాసిగా ఉన్న మొదటి దినం. జైన ఉపాశ్రయం (వసతి గృహం)లో ఉన్నాడు. రాత్రి అయింది.

జైనులు అక్కడ దీపాన్ని ఉంచలేదు. పైగా అతడు నేలపై పడుకున్నాడు. తలుపు దగ్గరగా అతడు నిద్రించటానికి స్థలం ఏర్పాటు జరిగింది.

ఆ రాత్రి బయటకు పోవటానికి, జైనులు ఈతని కాలునో, వేలునో, శరీరాన్నో తొక్కుకుంటూ పోవలసి వచ్చింది. రాత్రంతా నిద్రేలేదు.

పైగా నేల మీద పడుకోవటం. జైన సన్యాసిగా తాను ఉండలేనని మహావీరునితో చెప్పాడు. మహావీరుడు మేఘ కుమారునితో అతని గత జన్మ చెప్పాడు.

గత జన్మలో అతను మేరు ప్రభ అనే పేరు గల ఏనుగా జన్మించాడు. అది జంతువే. అయినా పరోపకారి.

ఒకసారి దానికి దురదగా ఉంటే లేచి నిల్చుంది. ఆ సమయంలో ఒక కాలును పైకి ఎత్తింది. అప్పుడే ఒక కుందేలు సరిగ్గా తన పాదము ఎక్కడ ఉంచవలయునో అక్కడికే వచ్చింది.

చుట్టూ దావానలం వ్యాపించింది. ఆ భయంతో ఆ కుందేలు పిల్ల అక్కడే ఉండిపోయింది. అలా ఆ కుందేలు రెండున్నర దినాలు ఉండిపోయింది.

ఏనుగు కాలు దించితే, ఆ కుందేలు పిల్ల చచ్చిపోతుంది. కానీ ఏనుగు కాలు దించలేదు. శరీరం పట్టు తప్పింది.

మూడు రోజులు నరక యాతన అనుభవించి ఆ ఏనుగు మరణించింది. ఆ ఏనుగే మరు జన్మలో మేఘ కుమారుడు. ఈ విషయం మహావీరుని ద్వారా విన్న మేఘ కుమారుడు ఆలోచించాడు.

జంతువుగా జన్మించిన ఏనుగు అల్ప ప్రాణి కోసం ప్రాణ త్యాగం చేసి, మానవ జన్మ సంపాదించినప్పుడు, మానవుడుగా ముక్తి కోసం తానెంత కష్టపడవలసినదో మహావీరుని ద్వారా విన్నాడు.

జైన సన్యాసిగా తన జీవితాన్ని పురంకితం చేసుకున్నాడు. మహా వీరుడు సంతసించాడు.

తేదీ వివరాలు అలభ్యములు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles