వైష్ణవ జనతో… …. మహనీయులు – 2020… అక్టోబరు 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మరాఠీకి జ్ఞానేశ్వరుడు గట్టి పునాది వేసినట్లే, నరసింహ మెహతా గుజరాతీ భాష విషయంలో అదే చేశాడు.

సాయిబాబా జీవిత చరిత్రవలె, నరసింహ మెహతా జీవిత చరిత్ర అద్భుత కథనాలతో సాగిపోతుంది.

నరసింహ మెహతా తన కీర్తనలలోనే కృష్ణుడు తనకు అందించిన సాయం గూర్చి తెలియచేసాడు.

కుమారుడైన శ్యామల్ వివాహ విషయంలోనూ, కుమార్తె అయిన కున్వర్ బాయి సారె విషయంలోను, ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని పేర వ్రాసిన “హుండి” కి డబ్బులు కృష్ణుడే స్వయంగా డబ్బు ఇవ్వటం విషయంలోనూ – ఇలా ఎన్నో…

తండ్రి తద్దినానికి భోక్తలను, పురోహితులను, ఇంటిలో కూర్చోబెట్టి, నేయి తేవటానికి బయలు దేరాడు మెహతా.

దారిలో నామ గానం (సంకీర్తనం) చేసే వారితో కలసిపోయి, అసలు నేయి తీసుకుని ఇంటికి వెళ్లటం మరచిపోయాడు.

ఇంటి వద్ద భర్త రాకకై, భర్త తెచ్చే నేయి కోసం ఎదురుచూస్తోంది మానెక్ బాయి. ఇక భోక్తలు, పురోహితులు ఆదుర్దా చెప్పరానిది.

ఎంతకూ రాడు. అడుగో, వడి వడిగా వచ్చేశాడు మెహతా  –  చేతిలో నేతి డబ్బాతో (పాత్రతో).

మంత్రాలు చదివారు. ఆబ్దికం పూర్తయింది. వచ్చిన వారికి తలా బంగారు నాణెం ఇచ్చాడు మెహతా. అందరూ దీవించి వెళ్లిపోయారు.

ఇక మెహతా భోజనం చేయాలి. భోజనం వడ్డించారు. మెహతా భోజనమునకు కూర్చునే సమయంలో, మెహతా నేతి డబ్బాతో వచ్చాడు. వెంటనే భోజనమునకు కూర్చోబోయిన మెహతా మాయమయ్యాడు. చూచే వారికి వింతగా తోచింది.

మొదట నేయి పట్టుకు వచ్చి, తద్దిన తతంగం జరిపించింది మెహతా రారంలో వచ్చిన శ్రీకృష్ణుడని అందరూ గ్రహించి, సంతోషించారు.

నరసింహ మెహతా భక్తికి శ్రీకృష్ణుడే పరపశుడైనా, మెహతా అంటే గిట్టని వారు కూడా ఉన్నారు.

వారు జూనాగఢ్ రాజైన మాండలికునకు చాడీలు చెప్పారు. రాజు గడ్డు పరీక్ష పెట్టాడు నరసింహ మెహతాకు.

ఒక పూలమాలను తెచ్చి రాధా దామోదర విగ్రహానికి వేసి తలుపులన్నీ మూయించాడు. తెల్లవారేటప్పటికి రాధా దామోదర్ మెడలో ఉన్న పూలమాలలు మెహతా మెడలో ఉండాలి. రాజు కట్టుదిట్టం చేసి వెళ్లిపోయాడు.

తెల్లవారుతోంది. రాజు వస్తున్నాడు తన సైన్యంతో. కృష్ణుడు తన మెడలోని హారాన్ని మెహతా మెడలో వేయలేదు.

కేదార రాగంలో తన వ్యధను వినిపించాడు, మెహతా. మూసిన తలుపులు తెరుచుకున్నాయి.

 శ్రీకృష్ణుడు రావటం, మెహతా మెడలో పులా హారం వేయటం కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయాయి. ఇది మెహతా భక్తి, కాదు శక్తి.

నేడు అక్టోబరు 2. ఈనాడు ప్రత్యేకంగా నరసింహ మెహతాను గుర్తుంచుకోవలసిన సమయం వచ్చింది.

నేడే గాంధీజీ పుట్టిన రోజు. గాంధీజీకి ప్రియమైన వైష్ణవ జనతో తేనే కహీయే…గీతాన్ని రచించినది నరసింహ మెహతాయే.

నరసింహ మేఘాతాను, గాంధీజీని స్మరించి వైష్ణవునిగా జీవిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles