ఆధ్యాత్మిక సైనికుడు …. మహనీయులు – 2020… అక్టోబరు 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గణిత శాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ఏ తొమ్మిది ప్రశ్నలకైనా జవాబులు వ్రాయవచ్చును.

కానీ, స్వామి రామతీర్థ, ప్రశ్నా పత్రములో ఇచ్చిన 13 ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి, ఏ తొమ్మిది జవాబులనైనను స్వికపింప వచ్చును అని వ్రాశాడు పరీక్షాధికారికి సూచనగ.

గణిత శాస్త్రంలో ఉత్తమోత్తముడు. రామతీర్థ గణిత శాస్త్రంలో ఆచార్య పదవిని అందుకున్నారు అతి చిన్న వయసులోనే.

వివాహం కూడా అయింది. కఠినమైన లెక్కలను, ఎంత సునాయాసంగా భోదించగలడో, అంతే సునాయాసంగా వేదాంతాన్ని బోధించగలడు. సన్యాసం స్వీకరించాడు.

సాయికి విజయానందుడు అనే ఒక సన్యాసి విషయంలో “కాషాయానికి కళంకం తేకూడదు” అన్నారు.

స్వామి రామతీర్థ కాషాయానికి వన్నె తెచ్చిన మహనీయుడు. ఇది భారత దేశానికే పరిమితం కాదు. ఆయనను ఎన్నో దేశాలు ఆహ్వానించాయి, గౌరవించాయి, సన్మానించాయి.

ఒకసారి ఆయనకు ఈజిప్టు నుండి ఆహ్వానం వచ్చింది. అక్కడ ఘన స్వాగతం లభించింది.

అక్కడ ఒక మసీదులో పారశీకపు భాషలో (పెర్షియన్ భాష) ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.

జపానులోను, అమెరికాలోను ప్రసంగించి, అక్కడి వారలను సంతుష్టులను చేసి, తిరిగి ఓడపై భారత దేశం రావటానికి ఓడ ఎక్కాడు.

ఆ ఓడలో అనేక స్టీలు పెట్టెలు కనబడ్డాయి. “అవేమిటి” అని ఆయన ప్రశ్నించాడు.

ఆయనకు జరిగిన ఉపన్యాసాలున్న పత్రికలు అని చెప్పారు. ఒక సన్యాసి తన సన్మానాలను ఇతరులకు చాటుకోవాలా?

ప్రసంగింప చేసే సరస్వతీ మాత, తన నాలుకపైన నాట్యం చేయాలి గాని, వార్తా ప్రత్రికలలో కాదు అని భావించి, “జై గంగ భవాని” అంటూ ఆ పెట్టెలను సముద్ర జలాలోనికి త్రోసివేయించాడు.

తన ఆత్మను అన్నిటా దర్శించే వాడు. ఆయన ఆచార్యునిగా ఉన్నప్పుడు కూడా, ప్రతి విద్యార్థినిని కృష్ణ రూపాలుగానే భావించేవాడు.

సాయిబాబా వలే ఆకలి విలువను తెలిసిన వాడు, ఇంకా జ్ఞానపు విలువను కూడా తెలిసిన వాడు.

బీదరికంలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాత్రి పూట భోజనం మాని, అందువలన మిగిలే డబ్బుతో రాత్రి చదువుకునేందుకు కిరసనాయిల్ ను కొనుక్కునేవాడు.

ఆచార్యునిగా ఉన్నప్పుడు, ఆకలికి తట్టుకోలేని ఏ విద్యార్థి అయినా రామ తీర్థుల వారి పేరు చెప్పి రామతీర్థుల ఖాతాలో ఖర్చు వ్రాయించి, ఆకలిని తీర్చుకునే వారు. అలా, ఆకలితో ఉన్న విద్యార్థులే చేసేవారట.

ఈయన రామ చరితమానస్ రచించిన తులసీదాసు వంశీకుడు.

నేడు అక్టోబర్ 17. ఈయన 17 అక్టోబర్, 1906లో తన 33వ ఏట దేహాన్ని గంగార్పణం చేశాడు.

నేడు ఆయన పుణ్య తిధి.

ఆయన తెలిపినట్లు అందరమూ ఆధ్యాత్మిక సైనికులమవుదుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles