Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
విజయనగరం పరిసర ప్రాంతాల్లో జన్మించారు ప్రకాశానందస్వామి. వీరి బాల్య నామము అనంతయ్య పంతులు.
ఈయనకు బాల్యముననే వైరాగ్యం అబ్బింది. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు.
బెల్గాంలో డిప్యూటీ కలెక్టరుగా పసిచేస్తున్న లల్లూ భాయి గోవర్ధన దాసుతో పరిచయమైంది. లల్లూ భాయి గొప్ప వేదాంతి. ఆయన అనుమతితో తీర్థయాత్రలకు బయలుదేరాడు అనంతయ్య.
అమరేశానందుల శిష్యులై విద్యల నభ్యసించి ‘ప్రకాశానంద’ నామధేయుడయ్యాడు.
ఆయన మధుకరి వృత్తితో జీవించేవారు. ఒక చింకి బొంత, ఒక మట్టి పిడత ఆయన ఆస్తులు.
ఆయనలోని సత్తును పసిగట్టిన మహారాజులెందరో ఆయనకు ఆశ్రమాలు కట్టిస్తామన్నా అంగీకరించలేదు ఆయన.
ఎక్కడకు పోయినా శ్మశానంలో గాని పాడుబడిన గుడిలో గాని, చెట్టు నీడన గాని ఉండేవారు. ఏనాడు డబ్బును చేతితో తాకలేదు.
ఆధ్యాత్మిక బోధలు చేసేవారు. జబ్బులు నయం చేసేవారు. ఒకసారి మొరబీ మహారాజుకు వచ్చిన జబ్బును ప్రకాశానందులు తొలగిస్తే, మహారాజు లక్ష రూపాయలను ఇచ్చి ధర్మకార్యాలకై వినియోగించమని వేడుకున్నారు.
ప్రకాశానందులు అంగీకరించక, ఆ సంవత్సరం పంటలు పండక బాధపడుతున్న రైతుల నుండి పన్నులు వసూలు చేయవద్దన్నారు. సరే అని మహారాజు 20 లక్షల రూపాయల పన్నును మాఫీ చేశాడు.
పిరాడియా మహారాజు ఆయనను తమ రాజధానికి ఆహ్వానిస్తే, “అరణ్యానికైతే వస్తాను గాని దర్బారులకు రాను” అని నిక్కచ్చిగా చెప్పారు.
ఆయన మరో యోగైన నిత్యానందస్వామి మొదలైన వారితో మాట్లాడిన మాటలు వార్తాలాపంగా వెలువడ్డాయి.
ప్రకాశానందులు తెలుగువారైనా గుజరాత్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో ఉన్నా, తెలుగు భాషను మరువలేదు.
తెలుగు లిపిలోనే గుజరాతీ, హిందీ భాషలు వ్రాసేవారు. వార్తాలాపం తెలుగు లిపిలో ఉన్న గుజరాతీ గ్రంథం.
దానిని తెలుగు, గుజరాతీ, హిందీ భాషలు వచ్చిన వ్యక్తి తెలుగులోకి తర్జుమా చేసారు.
ఆ గ్రంథం అమూల్యమైనది. ఇందులో 35 ప్రసంగాలున్నాయి. శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాల నుండి సూక్తులు, గాథలు వినువారికి, చదువు వారికి మహానందమిచ్చే గ్రంథం.
డాక్టరు వీరాజీ భాయి ప్రకాశానందుల చినిగిన బొంత నుండి ఒక గుడ్డ పీలికను స్మృతి చిహ్నంగా తీసుకున్నారు. తాము సమాధి చెందుతామని ముందే సూచించారు.
ఒక బిడ్డకు నామకరణం చేస్తూ “నా పేరు ఇతనికి ఇస్తున్నాను. నా పేరు తారుమారు చేసి ఆనంద్ ప్రకాశ్ అని పిలవండి. ఇకపై నాకే పేరు అక్కరలేదు” అన్నారు.
23 ఫిబ్రవరి 1962న చుట్టుపక్కలనున్న వారిని చూచి, ప్రకాశానందులు చిటిక వేసి ‘చలో’ అన్నారు.
అదే సమయాన ద్వారకాధీశుడు ధరించిన కోటి రూపాయల విలువ చేసే, కిరీట కుండలాలు జారీ పడిపోయాయి.
ఆయన కోరిక ప్రకారం ఆయన భౌతిక దేహాన్ని గోమతి సంగమస్థానంలో సముద్రంలో విడిచిపెట్టారు.
తెలుగువారికి ఆయన ప్రసాదం ‘వార్తాలాపం’ లభ్యమైంది. నేడు ఆయన సమాధి దినం. వార్తాలాపం పఠించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దేవీ! బ్రోవ సమయమిదే!! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 6
- ప్రసాదం – దర్శనం మహనీయులు – 2020… జూలై 22
- గురుపాదమునుంచ నేను …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 17
- మాయా శక్తి…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 1
- (అ) ద్వితీయుడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments