తక్కువేమి మనకు? …. మహనీయులు – 2020… మే 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


చిత్తంపిస్వామి కేరళకు చెందిన మహనీయుడు. సాయివలె బాల్యంలో కష్టపడి పనిచేశాడు.

దిన భత్యపు కూలీగా కూడా పని చేశాడు. విజ్ఞానతృష్ణ చాలా అధికంగా ఉండేది.

ఒకసారి ఈయనకు బాల్యంలో అయ్యప్పస్వామి మందిరం వద్ద ఒక వృద్ధ సాధువు సుబ్రహ్మణ్యస్వామి మంత్రోపదేశంచేసి, “దీని వలన సకలము నీకు సిద్ధిస్తుంది” అని చెప్పాడు.

మంత్ర శక్తి వలన అనేక శక్తులను పొందాడు. 28 ఏండ్లకే కేరళలో సుప్రసిద్ధ ఋషిగా పేరుగాంచాడు.

ఒకసారి చిత్తంపిస్వామిగళ్ ను గురువాయూరుకు చెందిన వెల్లప్ప మీనన్ ఈత పోటీకి రమ్మని బలవంతం చేశాడు.

అక్కడ అతి పెద్దదైన చెరువు ఇవతలి గట్టు నుండి అవతలి గట్టుకు మరల అక్కడ నుండి మొదటి గట్టుకు ఎవరు ముందుగా ఈదగలరో అని మీనన్ సవాల్ చేశాడు.

చిత్తంపిస్వామిగళ్ ఇవతలి గట్టునుండి అవతలి గట్టు వరకు పందెం చాలునన్నాడు. మీనన్ ససేమిరా అన్నాడు. అట్లాగే అనక తప్పలేదు చిత్తంపిస్వామిగళ్ కు.

చిత్తంపిస్వామి ఆవలి గట్టు చేరి, ఇవతలి గట్టుకు సగం దూరంలో ఉన్నాడు. మీనన్ గట్టు చేరకముందే శక్తినంతా కోల్పోయి డీలాపడిపోయాడు. నోటిలోకి నీరు పోయింది.

దీనినంత చూసినా చిత్తంపిస్వామి, వెనుదిరిగి మీనన్ ను ఒక చేతిమీద వేసుకుని, రెండో చేతితో ఈదుకుంటూ బయలుదేరిన గట్టుకు చేరాడు.

ఇది చిత్తంపిస్వామి చూపే మానవత్వపు విలువ. అందరకూ ఆదర్శమే కదా!

చిత్తంపిస్వామి అందరకూ దీక్షను ఇచ్చేవాడు. డాంబికుడైన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈయన వద్దకు వచ్చి తన ఇంటికి విందుకు రమ్మని కోరాడు.

నేను ఒక్కడినే కాదు నాతోపాటు ఇంకొందరు శిష్యులను కూడా భోజనానికి తీసుకువస్తాను అన్నాడు చిత్తంపిస్వామి. “సరే” అన్నాడు అధికారి.

చిత్తంపిస్వామి భోజనానికి వచ్చాడు. ఆయనతోపాటు వీధి కుక్కలు కొన్ని వెంట వచ్చాయి.

ఆ కుక్కలు కూడా వడ్డించబడిన విస్తళ్ళముందు బుద్దిగా కూర్చున్నాయి. వడ్డించినవాటిని తిన్నాయి.

తినటం అయిపోగానే, తమ కంచాలను తామే (ఆ కుక్కలే) నోటితో కరచుకొనిపోయి ఎక్కడ పారవేయాలో అక్కడ పడవేశాయి. ఇది వింతగానూ, అద్భుతంగాను అనిపించింది ఆ అధికారికి.

“ఈ కుక్కలు గత జన్మలో ఉన్నత అధికారులు. వారికి లంచం, అణచివేత మొదలగు దుర్గుణాలన్నీ ఉన్నాయి. మరణించిన తరువాత కుక్కలుగా జన్మించారు” అని చెప్పారు స్వామి.

ఇది సామాజిక నీతి సూత్రమేకాదు, ఆధ్యాత్మికంగా విలువైన సంఘటన.

వీరాధిరాజతీర్థ పరమ భట్టారగా పేరు గాంచిన, చిత్తంపిస్వామి వారు, సాంఘిక చైతన్యం తెచ్చారు.

చిత్తంపిస్వామి మే 5 (1924)న మహాసమాధి చెందారు.

నేడు మే 5, చిత్తంపిస్వామిని స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles