Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సంగటిగుంట నుండి ఒక వ్యక్తి కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికి పోతూ నల్లమస్తాన్ గారి అనుమతి అడిగాడు.
“నీవు కాశీ పోతున్నావు కదా? అక్కడ ఒక స్నేహితుడు జంగాలాయన ఉన్నాడు. ఆయన్ని నేను అడిగానని చెప్పు” అన్నారు.
ఇంకా వివరాలు కావాలని అడిగితే “అతను మెల్ల కన్ను జంగాలాయన” అని మాత్రం చెప్పారు మస్తాన్.
కాశీని దర్శించాడు ఆ వ్యక్తి. జంగాలాయన కనబడలేదు. ఇక కాశీ నుండి బయలు దేరబోతుంటే ఒకాయన వచ్చి “ఎక్కడనుండి వచ్చారు?” అని అడిగాడు. “గుంటూరు నుండి” అన్నాడు.
“ఐతే నల్లమస్తాన్ తెలుసా?” అడిగాడు. అప్పుడు స్ఫురణకువచ్చి “మిమ్ములను నల్లమస్తాన్ గారు అడిగినట్లు చెప్పామన్నారు” అన్నాడు. ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు.
ఆ సంగటిగుంట భక్తుడు నల్లమస్తాన్ గారి దగ్గరకు వచ్చి, జంగాలాయన కనబడ్డాడని చెప్పాడు. నల్లమస్తాన్ గారు నవ్వసాగారు. కారణం అడిగాడు భక్తుడు.
“నీవు ఆయన కోసమే కాశీ వెళ్లవు కానీ, ఆయన ఎదురుగా కనబడినా కూడా గుర్తు పట్టలేకపోయావు. నీకు కనబడిన జంగాలాయనే శివుడు” అన్నారు మస్తాన్ గారు మళ్ళీ నవ్వుతూ.
నమ్మి ఆశీస్సు కోసం వెళ్ళిన వ్యక్తికి శివుడినే స్వయంగా చూపారు నల్లమస్తాన్ గారు. భక్తులు అలా గుర్తించలేకపోవటం జరుగుతూనే ఉంటుంది – బి.వి. దేవ్ సాయిబాబాను బెంగాలీ సాధువుగా ఉన్నప్పుడు గుర్తించలేకపోయాడు.
సాయిబాబా, నల్లమస్తాన్ గారు ఖండ యోగం చేసేవారు. నిజం రాష్ట్ర నివాసి నూరుల్ ముస్తాఫా ఖాదర్ ఒకసారి గుంటూరు వచ్చారు.
నల్లమస్తాన్ గారిపై ఆయనకు నమ్మకము కలుగలేదు పరీక్షచేయుటకు ముస్తాఫా తయారుగా ఉన్నాడు.
ఒక పెద్ద పాత్ర నిండా తైలము (నూనె) తెప్పించి, పొయ్యిమీద ఉంచి, సల సలకాచి, సమాధిమగ్నుడైన నల్లమస్తాన్ శరీరముపై పోశాడు.
దేహ భ్రాంతి లేని నల్లమస్తాన్ గారిని ఆ వేడి వేడి నూనె ఏమీ చేయలేకపోయింది.
ముస్తాఫా తన తప్పును తెలుసుకొని నల్లమస్తాన్ శిష్యుడయ్యాడు.
గుంటూరు నల్లమస్తాన్ గారు 23 మే 1895న దేహాన్ని విడిచారు.
సాయిబాబా మహాసమాధిని హిందూ, ముస్లింలు మొదలైన వారు దర్శించినట్లు, నల్లమస్తాన్ గారి మహాసమాధిని దర్శిస్తారు.
నేటికీ ఆయన ఎన్నో మహిమలు చూపుతున్నారు. గుంటూరులో ఉండే సీతారావమ్మ గారికి జబ్బు చేసింది. డాక్టర్లు చనిపోతుందన్నారు.
ఆమెకు నల్లమస్తాన్ గారి మహత్తు తెలిసి మ్రొక్కుకుంది. జబ్బు నయమైంది. ఆమె ఇక మ్రొక్కును తీర్చుకుందామనుకుంది.
ఆ రాత్రి నల్లమస్తాన్ గారు ఆమెకు స్వప్నంలో కనపడి “అమ్మా! నా మ్రొక్కుదేముందిలే ఎప్పుడేనా నీవు తీర్చవచ్చు. మూడు సంవత్సరముల క్రితం ఐదు కొబ్బరి కాయలు కొడతానని శివుడికి, అమ్మవారికి, నాగేంద్రస్వామికి, గణపతికి, అయ్యప్పకు మ్రొక్కుకున్నావు. ముందు ఆ మ్రొక్కు తీర్చు” అన్నారు.
మెలకువ వచ్చింది. నల్లమస్తాన్ గారు చెప్పినదంతా సత్యమే. భక్తులను తప్పుచేయనీయరు.
నేడు మే 23, నల్లమస్తాన్ గారి మహాసమాధి దినం. ఆ మహనీయుని స్మరించి తరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భవతారిణి…. మహనీయులు – 2020… మే 31
- రమ్య భవనం …..సాయి@366 మే 20….Audio
- జీవించు – జీవించనీయి…. మహనీయులు – 2020… మే 10
- నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి. …. మహనీయులు – 2020… మే 12
- పిబరే రామరసం …. మహనీయులు – 2020… మే 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments