బాలకృష్ణా! నిన్ను నే చేరి కోలతు…. మహనీయులు – 2020… జూలై 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా వద్దకు పండరీపురంనుండి రాధాకృష్ణమాయి వచ్చింది. ఆమె కృష్ణ భక్తురాలు.

రామకృష్ణ పరమహంస భక్తురాలి పేరు అఘోరమణీ దేవి. కానీ అందరూ ఆమెను గోపాలేర్ మా అంటారు.

ఆమె బాలకృష్ణునిపై పెంచుకున్న భక్తి కారణంగా ఆమెను గోపాలేర్ మా, అంటే గోపాలుని తల్లి అనేవారు. కృష్ణ ప్రేమకు పరిధిలేదు.

ఆమె ఒకసారి జగన్నాథ రధోత్సవాన్ని చూడటానికి వెళ్ళింది. ఆ జగన్నాథునిలో తన బాలకృష్ణుని చూసింది. అది అద్భుత దర్శనమే.

అంత మాత్రమే కాదు, ఆ రథాన్ని లాగుతున్న ప్రజలలో కూడా కృష్ణుని దర్శించగలిగింది.

అన్నింటిలోను, అంతటా భగవంతుని దర్శించగలగటం పరాకాష్ట అవుతుంది. తాను పెంచుకునే పిల్లిలో కూడా ఆమె గోపాలుని చూసేది.

ఆ పిల్లి ఒకసారి నివేదిత ఒడిలో పడుకుంది. ఎవరో చూచి ఆ పిల్లిని వెళ్ళగొట్టారు.

వెంటనే గోపాలేర్ మా “నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా. గోపాలుడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయాడు” అని పిల్లిని వెళ్ళగొట్టిన మహిళతో కఠువుగా అంది.

ఆమె భక్తురాలు. ధ్యానం కూడా చేసేది. ఒకసారి ఆమెను చూడటానికి రామకృష్ణులు ఆమె గదికి వెళ్ళారు.

ఆమె అప్పుడు ధ్యానంలో ఉంది. ఆ గదినిండా దోమలు, కీటకాలు విలయతాండవం చేస్తున్నాయి.

ఆమె ప్రపంచ ద్యాస లేకుండా భగవన్నామంలో లీనమైంది. ఆమెను దర్శించటానికి వచ్చిన వారిలో ఒకరు మరునాడు దోమతెరను తీసుకువచ్చి ఇచ్చారు.

ఆ రాత్రి ఆమె జపం చేయటానికి కూర్చుంది. ఆమె మనసంతా ఆ దోమతెరమీదనే ఉంది.

ఏ బొద్దింకో, ఏలుకో దోమతెరను కొరకివేస్తుందని ఆమె మనసు పరిపరి విధాల ఆలోచించింది. ఈ ఆలోచనా సరళిని ఆమె గ్రహించింది.

ఈ తుచ్ఛమైన దోమతెర నా మనస్సును గోపాలుని మీదనుండి వేరు చేస్తుందని గ్రహించి, ఏం చేయాలా అని ఆలోచించి, తెల్లవారగానే, ఆ దోమతెరను మూటగట్టి దోమతెర ఇచ్చిన వారికి తిరిగి ఇచ్చివేసింది.

“ఇది (ఈ దోమతెర) నా మనస్సును భగవంతుడి నుండి వైదొలగచేస్తోంది. నాకు వద్దు” అంది గోపాలేర్ మా.

ఆమె ఒంటరిగానే ఉండేది. అసలు ఆమె ఒంటరిగా ఎలాగుంది?…బాలగోపాలుడు ఎల్లవేళలా ఆమె వద్దనే ఉంటాడుగదా! ఆమె ఇతరుల నుండి సేవను ఏ మాత్రం ఆశించేది కాదు.

గోపాలేర్ మా జూలై 8  (1906)న గోపాలునిలో లీనమైంది. నేడు జూలై 8. గోపాలేర్ మా వర్థంతి. ఆమె మాటలను స్మరిద్దాం –

ఎవరైనా ఉపదేశ మిమ్మని ఆమెను కోరితే ఇలా చెప్పేది – “గోపాలుడిని అడుగు. అతడు నీలోనే ఉన్నాడు. అతడికన్నా గురూపదేశం ఎవ్వరు ఇవ్వలేరు. ఇది సత్యం. పరితప్త హృదయంతో విలపిస్తే, నువ్వు అతడిని చేరుకోగలవు”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles