పదములె చాలును, ఓ సనాతనా! … మహనీయులు – 2020… జూలై 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి అన్నదమ్ములు. వారు హుస్సేన్ షా కొలువులో ఉన్నతాధికారులు.

ఆ మువ్వురకు ప్రాపంచిక విషయాలపై రోతపుట్టి, ఆధ్యాత్మిక పథం కోసం అర్రులు చాచేవారు.

ఆ మువ్వరకు చైతన్య మహాప్రభు అండ దొరికింది. రూప, అనుపమలు కొలువు నుండి తప్పించుకునిపోయారు. అన్నగారైన సనాతనుడు అనంతరం అతి కష్టంమీద కొలువు నుండి బయటపడ్డాడు.

సనాతనుడు మధుర చేరాడు. ప్రతి దినం గోవర్ధన పర్వతానికి ప్రదక్షణ చేసేవాడు. సనాతనుడే ప్రథమముగా అక్కడ కృష్ణుని మందిరాన్ని నిర్మించాడు. దైవం పేరు మదన మోహనుడు.

చైతన్య ప్రభువుల ఆదేశం ప్రకారం ఆయన అనేక గ్రంథాలను రచించారు. బిక్షగా తెచ్చిన గోధుమపిండితో, నిప్పులపై రొట్టెను తయారుచేసి, మదన మోహనునకు అర్పించిన తరువాత తాను భుజించేవాడు.

ఆ రొట్టెలో ఉప్పు ఉండేది కాదు. చప్పగా ఉండేది. మదన మోహనుడే ఒకసారి ఉప్పులేని రొట్టెను తినలేనన్నాడు.

 “ఇవాళ ఉప్పు, రేపు నెయ్యి అడుగుతావు. నేను ధనవంతులను అడిగి తెచ్చేటంత సమయం నాకులేదు” అన్నాడు దైవంతో సనాతనుడు.

సనాతనుడు తన సమయాన్ని ఎలా పఠన, రచనలలో గడిపేవాడో ఈ సంఘటన తెలియచేస్తుంది.

ఒకసారి సనాతనుడు వ్రాసుకుంటూ ఉండిపోయాడు. ఆకలే మరచిపోయాడు. సాయంకాలమైంది, ఒక గొల్లపిల్లవాడు వచ్చాడు.

చేతిలోని పాల ముంతను సనాతనునికిచ్చి త్రాగమన్నాడు. “నేనేమీ తినలేదని అంటున్నావు. నీకెలా తెలుసు?” అని ప్రశ్నించాడు సనాతనుడు.

“ఉదయం నుండి, అక్కడే, అలాగే కూర్చుండిపోవటం నేను చూచాను” అన్నాడు ఆ గొల్లపిల్లవాడు. “అయ్యో! చిన్నపిల్లవాడివి నీవు పెద్దవారితో పంపలేకపోయావా పాలు?” అన్నాడు సనాతనుడు.

“ఎవరి పనులు వారికుంటాయి కదా” అని “తరువాత ముంత తీసుకుపోతాను” అని ఆ బాలుడు వెళ్ళిపోయాడు. వెళ్ళటంకాదు, ఆ బాలుడు మాయమయ్యాడు.

వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు బాలకృష్ణుడని, ఇకముందు బాలకృష్ణునికి కష్టం కలిగించకూడదని, ఎదో ఒకటి తినేవాడు సనాతనుడు. సాయి కూడా ఆకలితో ఉన్న భక్తులకు భోజనం సమకూర్చేవాడు.

దాదాపు 40 సంవత్సరాలు గోవర్ధనగిరిని  చుట్టివచ్చేవాడు – “నీకు ముసలితనం వచ్చింది. గోవర్ధనగిరి ప్రదక్షణ మానుము” అన్నాడు కృష్ణుడు. సనాతనుడు అంగీకరించలేదు.

వెంటనే కృష్ణుడు గోవర్ధనగిరి నుండి రాతిబండను తెప్పించి, మురళిని వ్రాయించసాగాడు. కృష్ణుడు నిలబడిన పాదములు క్రింద రాయి కరిగిపోయి పాద ముద్రలు ఏర్పడ్డాయి.

“ఈ నా పాదములున్న శిలకు ప్రదక్షణలు చేయి అది గోవర్ధనగిరి ప్రదక్షణంతో సమానం” అన్నాడు కృష్ణుడు.

సనాతనుడు అలాగే చేసి ఆషాడ పూర్ణిమనాడు 1448 కృష్ణునిలో ఐక్యమయ్యాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles