సద్గురు దర్శనం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 3



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా ఏ పీఠమును స్థాపించలేదు.

ఆదిశంకరులు భారత దేశమందు నాలుగు దిక్కుల నాలుగు పీఠములను స్థాపించారు.

అందులో ఒకటి ద్వారకా పీఠం. దాని ప్రధమ అధిపతిగా ఆయన హస్తమలకాచార్యులను మాఘ శుక్ల సప్తమినాడు (సామాన్యంగా మాఘ మాసం ఫిబ్రవరి నెలలో వస్తుంది) నియమించారు.

హస్తామలకుడు చిన్నతనం నుండే జడునివలె ఉంటూ ఎక్కడా విద్యాభ్యాసం చేయలేదు. ఉపనయన సంస్కారం పొందినా వేదాధ్యయనం చేయలేదు.

దృశ్య ప్రపంచాన్ని మరచి పరమాత్మలో లీనమయ్యే వాడు. తోటి బాలురతో నాడక, అన్న పానీయాలందు ఆసక్తి చూపక, మూగవానిలా జీవిస్తూ, నోటినుండి ఒక్కమాటైనా పలుకకుండా ఉండేవాడు.

ఈతని ప్రవృత్తిని చూచి అతని తండ్రి ప్రభాకరుడు ఆదిశంకరుల వద్దకు తీసుకుపోయాడు.

ఆదిశంకరులను చూడగానే ఎంతో వినయంగా ఆ బాలుడు నమస్కరించాడు. అంతవరకు అతడు నమస్కరించటం ఎవరూ చూడలేదు. జనులందరూ ఆశ్చర్యపోయారు.

“బాలకా నీవెవరు? ఎవరి పుత్రడవు? ఎచట నుండి వచ్చితివి?” అని అడిగారు ఆదిశంకరులు.

బాలుడు “ఓ సద్గురుమూర్తి! నేను జడుడను  కాను. జడ పదార్థం కూడా సాంగత్యంవలన చైతన్యమవుతుంది.

ఆరు అవస్థలకు అతీతుడను. ఆ పరబ్రహ్మము నేను…” అని శంకరులకు మరల నమస్కరించి ఆయన పాదపద్మముల చెంత చేరి ఆశువుగా 12 శ్లోకాలను చెప్పాడు.

అందులో ఉపనిషత్ సారమంతా ఇమిడి ఉన్నది. వేదాంతమంతా చేతిలోని ఉసిరిక పండు వలె స్పష్టంగా ఉంది. అవి హస్తామలక స్తోత్రాలయ్యాయి.

ఆ బాలుని తండ్రి అనుమతితో శంకరులు శిష్యునిగా స్వీకరించారు. ఆ బాలకుడే హస్తామలకాచార్యులయ్యారు.

ప్రభాకర పండితుని భార్య గతంలో తన పసిబిడ్డను యమునా నదీ తీరమున నున్న ఒక సిద్ధపురుషుని చెంత ఉంచి, స్నానానికి యమునకు వెళ్ళింది. పసిబిడ్డ దొరలి యమునా జలాలలో పడి మరణించాడు.

ఆ తల్లి తిరిగి వచ్చి మృతుడైన శిశువుని చూసి విలపించగా ఆ సిద్ద పురుషుడు మరణించిన శిశువు దేహంలో ప్రవేశించగా ఆ శిశువుకు మరల జీవం వచ్చింది. ఆ సిద్ద పురుషుడే ఈ హస్తామలకుడని ఆదిశంకరులు తెలిపారు.

ఆ కారణంగానే ఆ బాలుడు నిరుపమ బ్రహ్మ తత్వంతో ఉండసాగాడు. ఆదిశంకరుల దర్శన, స్పర్శలతో చైతన్యవంతుడైనాడు, ద్వారకా పీఠాధిపతి అయ్యాడు.

ఆ ద్వాదశ శ్లోకాలలోని కొన్నింటినైనా స్మరిద్దాం!

పరమాత్మ ఒక్కడే అయినా అనేక ఉపాధులలో చేరి అనేకంగా తెలియబడుతొంది. అనేక జీవులుగా తెలియబడుచున్నది.

ఆ శాశ్వతానంద పరమాత్మయైన ఆత్మే నేను. సోహం.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles