రామానుజాచార్యులు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా జీవితకాలంలోనే సాయి మందిరం ఏర్పాటైంది.

విశిష్టాద్వైత స్థాపకుల విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారు దాశరథి కుమారులు.

రామానుజాచార్యుల జన్మ స్థలమైన శ్రీ పెరుంబుదూరులో చక్కని ఆలయం తయారైంది. విగ్రహం కూడా సిద్ధమైంది.

విగ్రహ ప్రతిష్ట సమయంలో నేత్రోన్మీలనము అంటు ఆ విగ్రహపు నేత్రాలను చిన్న సుత్తి, ఉలితో సున్నితంగా తెరుస్తారు. అది పెరంబుదూరులో నేత్రాలను తెరిచే సమయం ఆసన్నమైంది.

పని జరుగుతున్నది. శ్రీరంగంలో రామానుజాచార్యులు గోష్టిలో పాల్గొంటున్నారు. అప్పుడు ఆయన నేత్రములందు ఎర్రని చారలు కనిపించాయి. దగ్గరగా కూర్చున్నవారంతా కంగారుపడ్డారు.

రామానుజాచార్యులవారు నవ్వుతూ “అక్కడ (శ్రీ పెరుంబుదూరు) నా విగ్రహానికి నేత్రోన్మీలనం జరుగుతొంది” అన్నారు.

శ్రీ పెరుంబుదూరుకు శ్రీరంగానికి కొన్ని వందల మైళ్ళ దూరం. అక్కడ శ్రీ పెరుంబుదూరులో విగ్రహరూపుడు, ఇక్కడ శ్రీరంగంలో నడయాడెరూపుడు.

సాయిబాబా పటానికి నమస్కరిస్తే తనకు నమస్కరించినట్లే అన్నారు.

ఒక గృహిణి రామానుజాచార్యులవారిని దర్శించటానికి శ్రీరంగం వచ్చింది.

ఆ భక్తురాలు రామానుజాచార్యుల వారిని చూసి ఆనందపరవశురాలైంది. అంతటి మహానుభావుల పాద చిహ్నములు తన ఇంట నుంచుకుందామని తలచింది.

ఆయనతో చెప్పినది కూడ. ఒకసారి శ్రీరామానుజులు శిష్యబృందంతో భిక్షకి వేంచేస్తున్నప్పుడు వారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ, నేలకు వాలి, తన చీర కొంగును నేలపై పరచి, పాద ముద్రలను కటాక్షింపమని వేడుకుంది.

ఆమె ఆర్తికి చలించిపోయిన రామానుజులు తన పాద పద్మాలతో ఆమె పరచిన చీర కొనను సుతారంగా స్పృశించారు. సంతోషంతో ఆమె తన గ్రామానికి వెళ్ళిపోయింది.

కొన్ని ఏండ్ల తరువాత రామానుజులు ఆమె ఇంటికి శిష్యబృందంతో వెళ్ళటం ఆమెకు మరింత ఆనందాన్ని చేకూర్చింది.

కన్నడ దేశంలో విఠలరాయలు రామానుజులను ఆశ్రయించి విష్ణువర్ధనుడనే పేరు స్వీకరించాడు.

ఆ ప్రాంతంలో దాదాపు పది వేలమందికి రామానుజుల విశేష వైదుష్యం తెలిసి, ఆయనతో సంభాషించాలనుకున్నారు. విష్ణువర్ధనుడు సుముఖంగానే ఉన్నాడు.

కానీ ఎంతో సమయం పడుతుంది ఎలాగా? అనే సమస్యవచ్చింది. రామానుజులవారు ఆ సభలో వేదిక మీద ఒక తెరను కట్టించి, తాను తెరవెనుకకు వెళ్ళిపోయి, “ఊ! ఇక మీరు చెప్పవలసినది చెప్పండి ఒకేసారి” అని పలికారు ఆ పదివేలమందితో.

ఆ పదివేలమంది ఒకేసారి రామానుజులను అడగటం, రామానుజులు ఆ పదివేలమంది సంశయాలను ఒకేసారి తీర్చటం జరిగింది.

రామానుజులు ఆదిశేషులే కదా! ఆదిశేషుకు పదివేల పడగలుంటాయి గదా! ఆ పదివేల నోళ్ళతో ఒకేసారి సంశయాలను తీర్చారు ఆదిశేషులైన రామానుజులు.

రామానుజులు చైత్ర మాసం (సామాన్యంగా ఏప్రియల్ లో వస్తుంది) శుక్ల పంచమినాడు జన్మించారు.

“వందే రామానుజం మునీమ్…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles