నివురుగప్పిన నిప్పు… మహనీయులు – 2020… జూలై 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజైన కళ్యాణ వర్మ మరణించాడు. ఇక అతని కుమారుడైన శాంతివర్మకే  పట్టాభిషేకపు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక రేపు పట్టాభిషేకం.

ఆ రాత్రి ఆయనకు స్వప్నం వచ్చింది. తనకై అలంకరింపబడిన సింహాసనంపై, మంజుశ్రీ కూర్చుని ఉన్నాడు.

తన గురువైన మంజుశ్రీ శాంతివర్మతో “కుమారా! నేను నీ గురువును. నీవు నా శిష్యుడవు. ఇద్దరం ఒకే సింహాసనంపై ఎలా కూర్చోగలం?”  అని ప్రశ్నించి అదృశ్యమయ్యాడు.

అంటే తాను రాజుగా ఉండకూడదని గురువైన మంజుశ్రీ అభిమతంగా గ్రహించి,  అప్పటికప్పుడే ఎవరికి తెలియకుండా, రాజ్యపు పొలిమేరలు దాటి వెళ్ళిపోయాడు శాంతివర్మ.

సరాసరి నలందా విశ్వవిద్యాలయానికి చేరాడు. ఆ నాడు అది సుప్రసిద్ధ బౌద్ధ విద్యాలయం. అక్కడ అప్పుడు 500 మంది ఆచార్యులు ఉండేవారు.

జినదేవ అనే పేరుగల ఆచార్యునివద్ద విద్యార్థిగా, సన్యాసిగా చేరాడు. జినదేవుడు శాంతివర్మకు శాంతిదేవుడని నామకరణం చేశాడు.

శాంతిదేవుడు తన సాధనను, విద్యాబ్యాసాన్ని ఎవరికి  తెలియపరచకుండా చేసేవాడు.

కొందరు అసూయాపరులు శాంతిదేవుని అవమానించదలచారు. కానీ శాంతిదేవుడు సంఘపు ఈ కట్టుబాటును అతిక్రమించాడో ఎవరూ చూపలేకపోయారు.

ఒక పెద్ద సభలో శాంతిదేవుని ఉపన్యసించమంటే తు  అంటె త రాని శాంతిదేవుడు నవ్వులపాలై నలందను విడిచిపోతాడని పథకంవేసి, పెద్ద సభను ఏర్పాటు చేసి ఎందరెందరినో ఆహ్వానించారు ప్రత్యర్థులు.

శాంతిదేవుడు ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో,  ఎవ్వరికీ తెలియదు. సభలో పీఠంపై దర్జాగా హుందాగా కూర్చుని “ఏ విషయాన్ని గూర్చి  ప్రసంగించమంటారు? మీకు తెలిసిన విషయాన్నా? తెలియన విషయాన్నా?” అని అడిగాడు శాంతిదేవుడు.

“తెలియని విషయాన్ని గూర్చి” అన్నారు ప్రేక్షకులు. “ఐతే చాలా చెప్పాలా, కొద్దిగా చెప్పాలా, అతి కొద్దిగా చెప్పాలా?” అని “మధ్యే మార్గంగా చెబుతాను” అని శాంతిదేవుడు ఆశువుగా “బోధిచార్యావతార” మును చెప్పాడు.

ఆయన చెప్పే సమయంలో మంజుశ్రీ శాంతిదేవుని ముందే ఉండటం ఎందరో చూశారు.

ఇంకా ఆశ్చర్యం గొలిపేటట్లు, శాంతిదేవుడు చెప్పటం సంపూర్ణం కాగానే, శాంతిదేవుడు, మంజుశ్రీ, ఆకాశంలో ఎగురుతూ అదృశ్యులయ్యారు.

సద్గురు సాయి తన వారిని పడనీయను, చెడనీయను అని తర్కడ్ కుమారునితో అన్నారు.

అత్యుత్తమ గ్రంథాలను సంస్కృతంలో రచించిన ఆచార్య శాంతిదేవుని స్మారక తపాల బిళ్ళను జూలై  28 (1988)లో ప్రభుత్వం విడుదల చేసింది,

“బుద్ధం శరణం గచ్చామి”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles