Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాచకొండ వెంకట నరసింహ శర్మ, మరొకరు రైలు పట్టాల వెంబడి పోతున్నారు. దూరంగా తమ వైపు రైలు వస్తోంది.
ఆ వ్యక్తి శర్మగారిని “రైలును ఆపగలరా?” అని అడిగాడు. “సరే” అన్నారు శర్మ. వెంటనే రైలు మార్గ మధ్యంలో ఆగిపోయింది.
శర్మ గారి శిష్యుడు పరీక్షలు వ్రాసినాడు. ఫలితాలు ప్రకటించిన పత్రికలో నెంబరు రాలేదు అని శర్మగారికి చెబితే “అట్లా జరగటానికి వీలులేదు. ప్యాసు అవవలసిందే” అన్నారు. సర్టిఫికెట్టులొ ప్యాసయినట్లు వచ్చింది.
శ్యామలరావు అనే మరో శిష్యుడు ప్రయాణిస్తున్న జీపు ఘాటు రోడ్డు నుండి లోయలో పడ్డది. ఆ సమయంలో ఆతడు శర్మగారిని తలచుకొని గావు కేక పెట్టాడు. ఆతడు రక్షింపబడ్డాడు.
ఒక పిల్ల శర్మగారిని కలుసుకోవటానికి సమయం పట్టింది. “నిన్ను కలుసుకోవటానికి ఇంతసేపు పడుతుందా?” అని శర్మ గారి చెంపపై కొట్టింది.
ఆ సంఘటనకు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ శర్మగారు ఆ బాలికలో దేవిని చూచానని, దేవ వాణి విన్నానని అన్నారు.
అంతటితో తమకు అబ్బిన సమస్త సిద్ధులను గంగార్పణం చేశారు. ఇక మరెప్పుడూ సిద్ధుల జోలికి పోలేదు.
సాయిబాబా కూడా తన భక్తులను “ఆ వేశ్యతో ముద్దులాట తగదు” అనే వారు. అంటే ఆధ్యాత్మిక పథంలో సిద్దులు, మహిమలు తగవని సాయి భావము.
వారు తమ దృష్టిని భగవద్గీతపై కేంద్రీకరించినారు. అసలు వారికి బాల్యం నుండి భగవద్గీత బాగా ఇష్టం.
ఒక నాడాయన మిఠాయి పొట్లం కట్టించుకుని గంగ ఒడ్డున కూర్చుని తింటున్నారు. తినటం అవగానే ఆ కాగితాన్ని పారవేశారు.
అది అయన వద్దకే వచ్చింది. ఆ కాగితాన్ని మరల పారవేసినా, తన దగ్గరకే రాసాగింది. ఇలా మూడు సార్లు జరిగింది.
శర్మ గారికి ఇది వింతగా తోచి ఆ కాగితాన్ని చదివారు. అది భగవద్గీత నాల్గవ అధ్యాయం.
శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని వివరించే శ్లోకాలున్నాయి ఆ కాగితంలో, అలా జరగటానికి కారణం ఉందని ఆయన గ్రహించారు.
విద్యా ప్రకాశానందగిరి గారి విషయంలో భగవద్గీత గ్రంథం వారి చేతులలోకి వచ్చింది.
మరోసారి గంగా తీరంలోనే భగవద్గీతపై ఇతరులతో చర్చిస్తుండగా, ఒక సాధువు వచ్చి సాంఖ్య యోగం బోధించి గంగా నదీ జలాలపై నడుచుకుంటు వెళ్లిపోయారు. ఆ యోగి ఎవరో కాదు పరమ శివుడేనని శర్మగారి భావం.
గీతలో చెప్పినట్లు కష్ట సుఖాలను సంతోషంగా అనుభవించేవారు ఆయన.
ఆయనకు ఉబ్బసం ఉండేది. రాత్రులందు ఆధ్యాత్మిక విషయాలను ఇతరులకు బోధించే సమయంలో ఉబ్బసం ఉండేది కాదు. ప్రవచనం ముగియగానే మరల ఉబ్బసం వచ్చేది ఆయనకు.
శర్మగారు భగవద్గీత సంవత్సరానికి ఒక అధ్యాయం చొప్పున నిజ జీవితంలో అభ్యసించి, సెప్టెంబర్ 24 (1962)న శ్రీకృష్ణునితో ఐక్యమయ్యారు.
నేడు సెప్టెంబర్ 24, శర్మ గారి వర్థంతి. గీతా పారాయణే గాక, అభ్యాసమును చేతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- అశృ జలాలతో అభిషేకం! …..సాయి@366 ఆగస్టు 12…Audio
- రెండు అడుగులు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 3
- త్రివిధ పద్ధతులు …. మహనీయులు – 2020… జూన్ 2
- ప్రేమను పెంచుకో …. మహనీయులు – 2020… సెప్టెంబరు 14
- ప్రార్థన బలం … మహనీయులు – 2020… జూలై 24
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments